Ind vs SL: ఆ ఎనిమిది మందికి నెగిటివ్‌!

టీమ్‌ఇండియా అభిమానులకు శుభవార్త! కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన మరో ఎనిమిది మంది భారత ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రెండో టీ20 జరగనుంది. శ్రీలంకతో మంగళవారం రెండో టీ20 జరగడానికి కొన్ని గంటలకు ముందు భారత

Updated : 27 Jul 2021 23:43 IST

(Photo:BCCI Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా అభిమానులకు శుభవార్త! కృనాల్‌తో సన్నిహితంగా మెలిగిన మరో ఎనిమిది మంది భారత ఆటగాళ్లకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయగా నెగిటివ్‌ వచ్చినట్లు సమాచారం. దీంతో బుధవారం రెండో టీ20 జరగనుంది. శ్రీలంకతో మంగళవారం రెండో టీ20 జరగడానికి కొన్ని గంటలకు ముందు భారత ఆటగాడు కృనాల్‌ పాండ్యకు పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌ బుధవారానికి వాయిదాపడింది. నెగిటివ్‌ వచ్చిన ఆటగాళ్లు రెండో టీ20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కృనాల్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 29న మూడో టీ20 ముగిసిన అనంతరం ఈ నెల 30న భారత ఆటగాళ్లు స్వదేశానికి రానున్నారు. అయితే కృనాల్‌ పాండ్య మాత్రం అక్కడే ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు సమాచారం. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని