T20 World Cup 2007: ఫైనల్ పోరు.. చివరి ఓవర్ను జోగిందర్కు ధోనీ ఎందుకు ఇచ్చాడంటే?
టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో సెప్టెంబర్ 24న.. ఇవాళ్టికి...
‘కెప్టెన్ కూల్’ నిర్ణయానికి కారణం చెప్పిన శ్రీశాంత్
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ఫార్మాట్లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తొలిసారి నిర్వహించిన ప్రపంచకప్ను భారత్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. 2007లో సెప్టెంబర్ 24న.. ఇవాళ్టికి 15 సంవత్సరాలు పూర్తైన నేపథ్యంలో అప్పటి జట్టులో సభ్యులు తమ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకున్నారు. ఓ క్రీడా ఛానెల్ నిర్వహించిన ‘07 ఛాంపియన్స్’ కార్యక్రమంలో శ్రీశాంత్, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ పాల్గొన్నారు. ఫైనల్ మ్యాచ్లో చివరి ఓవర్ను మీడియం పేసర్ జోగిందర్ శర్మకు ఎందుకు ఎంఎస్ ధోనీ బౌలింగ్ ఇచ్చాడో అనేది ప్రతి ఒక్కరి మదిలో మెదిలే ప్రశ్న.. తాజాగా ధోనీ నిర్ణయం వెనుక కారణం ఏంటనేది శ్రీశాంత్ తెలిపాడు. జోగిందర్ వేసిన బంతిని మిస్బా ఉల్ హక్ కొట్టగా.. ఫైన్ లెగ్సైడ్లో ఫీల్డింగ్ చేస్తున్న శ్రీశాంత్ చేతిలోనే పడింది. దీంతో భారత ఆటగాళ్లు, అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి.
‘‘జోగిందర్ బాగా వేస్తాడని ధోనీ నమ్మాడు. అందుకే బంతిని అతడి చేతికి ఇచ్చాడు. నేను, ధోనీ, యువరాజ్, హర్భజన్ సింగ్ ఇండియన్ ఎయిర్లైన్స్కు ఆడామని చాలా మందికి తెలియదు. జోగిందర్ శర్మ ఓఎన్జీసీ తరఫున ఆడేవాడు. మా జట్ల మధ్య దిల్లీలోనూ, బయట చాలా మ్యాచ్లు జరిగాయి. అందుకే జోగిందర్ సత్తా ఏంటో ధోనీకి తెలుసు. చాలాసార్లు జోగిందర్ ఆఖరి ఓవర్లలో మ్యాచ్లను గెలిపించాడు. అందుకే అతడిపై అంత నమ్మకంతో కీలకమైన చివరి ఓవర్ను ఇచ్చాడు. ధోనీ కెప్టెన్సీని తక్కువగా అంచనా వేయడానికి లేదు. అతడు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడో మ్యాచ్ ఫలితమే చెబుతుంది’’ అని శ్రీశాంత్ వివరించాడు.
శ్రీశాంత్ పట్టింది క్యాచ్ కాదు.. ప్రపంచకప్: ఇర్ఫాన్
‘పాక్తో ఫైనల్ మ్యాచ్లో ఫైన్లెగ్లో ఉన్న శ్రీశాంత్ ఆ రోజు కేవలం క్యాచ్ను మాత్రమే పట్టుకోలేదు. భారత్కు వరల్డ్ కప్ను పట్టేశాడు. అప్పట్లో సోషల్ మీడియా లేదు. అయితే ప్రతి ఒక్కరూ పాకిస్థాన్పై గెలిచిన విషయం గురించే మాట్లాడుకొనేవారు. మేమంతా బిగ్ ఫైనల్లో తలపడ్డాం. అప్పుడు ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉంది. తుదిపోరులో నా నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాను పూర్తి చేసిన తర్వాత చాలా అలసిపోయా. నా కెరీర్లో ఇప్పటి వరకు అలా ఎప్పుడూ జరగలేదు’’ అని ఇర్ఫాన్ చెప్పాడు. ఆ రోజు రోహిత్ శర్మ (30 పరుగులు: 16 బంతుల్లో) చాలా కీలకమైన పరుగులు చేశాడని, పాక్ ఎదుట మంచి స్కోరు ఉంచగలిగామని మాజీ పేసర్ ఆర్పీ సింగ్ గుర్తు చేశాడు.
అది నాకింకా గుర్తే: రాబిన్ ఉతప్ప
ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన రాబిన్ ఉతప్ప (50) పాకిస్థాన్పై గ్రూప్ దశలో అర్ధశతకం సాధించాడు. భారత్ తరఫున అతడే టాప్ స్కోరర్. ఈ మ్యాచ్లో స్కోరు సమం కావడంతో ఫలితం కోసం బౌల్ అవుట్ నిర్వహించారు. అందులోనూ రాబిన్ ఉతప్ప వికెట్లను పడగొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ‘‘నాకు ఇప్పటికీ నమ్మశక్యం కావడం లేదు. మనం టీ20 ప్రపంచకప్ను నెగ్గి 15 ఏళ్లు అవుతుందంటే ఆశ్చర్యంగా ఉంది. ఈ మధ్య కాలంలోనే జరిగినట్లు అనిపిస్తోంది. వరుసగా మూడు సార్లు బౌల్అవుట్ చేయడం ద్వారా మనం విజయం సాధించాం. మూడో బౌల్ అవుట్ను నేనే చేసి నా క్యాప్ను తీసి సంబరాలు చేసుకొన్న సంఘటన ఎప్పటికీ మరువలేను’’ అని రాబిన్ ఉతప్ప వివరించాడు. ప్రతి మ్యాచ్లో అవసరమైన పరిస్థితుల్లో కెప్టెన్ ధోనీ ఆటగాళ్ల సలహాలను, సూచనలను తీసుకొనేవాడని హర్భజన్ సింగ్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం