Shreyas - Dravid : రాహుల్ సర్ నాకు చెప్పింది అదే: శ్రేయస్ అయ్యర్
న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించి...
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో జరుగుతున్న మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్లో శతకం సాధించి భారత్ మంచి స్కోరు (345) సాధించడంలో శ్రేయస్ అయ్యర్ కీలక పాత్ర పోషించాడు. టీమ్ఇండియా బౌలర్లు రాణించడంతో కివీస్ను 296 పరుగులకే కట్టడి చేశారు. దీంతో భారత్కు 49 పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. అయితే కివీస్ బౌలర్లు జేమీసన్, సౌథీ దెబ్బకు 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే శ్రేయస్ అయ్యర్ (65) మరోసారి ఆపద్బాంధవుడి పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లోనూ అర్ధశతకంతో మెరిశాడు.
ఈ క్రమంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ చెప్పిన విషయాలను శ్రేయస్ వెల్లడించాడు. ‘‘ఎలాగైనా విజయం సాధించాలి. శతకం, అర్ధశతకం కంటే అదే ముఖ్యమైంది. రాహుల్ సర్ కూడా అధిక సమయం క్రీజ్లో నిలదొక్కుకోవాలని సూచించారు. మిడిలార్డర్లో పరుగులు రాబట్టేలా భాగస్వాయమ్యాలను నిర్మించాలని పేర్కొన్నారు. అందుకే సెషన్కు సెషన్కు వీలైనన్ని బంతులు ఆడాలని నిర్ణయించుకున్నా. ముందు జరగబోయే దాని గురించి ఆలోచించకుండా.. ఇప్పుడు ఏం చేయాలనేదానిమీదే దృష్టి పెడుతున్నా’’ అని వివరించాడు. తాము కనీసం 275-280 పరుగులను లక్ష్యంగా నిర్దేశించాలని భావించామని చెప్పాడు. భారత స్పిన్నర్ల మీద నమ్మకం ఉందని, ఆఖరి రోజు కివీస్ను ఒత్తిడిలోకి నెట్టేస్తామని పేర్కొన్నాడు. ఇంతకుముందు కూడానూ ఇలాంటి కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు తెలిపాడు. అయితే టీమ్ఇండియా తరఫున కాకుండా రంజీల్లో అనుభవించినట్లు వివరించాడు. ఒకే టెస్టులో శతకం, అర్ధశతకం సాధించిన శ్రేయస్కు ఆటగాళ్లు స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చారు.
రెండో ఇన్నింగ్స్లో శ్రేయస్తోపాటు సాహా (61*), అశ్విన్ (32), అక్షర్ (28*) రాణించడంతో భారత్ 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. దీంతో మొత్తం 283 పరుగుల ఆధిక్యం సాధించిన టీమ్ఇండియా కివీస్కు భారీ లక్ష్యాన్ని (284) నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ నాలుగో రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. అశ్విన్ బౌలింగ్లో విల్ యంగ్ (2) ఔటయ్యాడు. ఆఖరి రోజు కివీస్ విజయానికి 280 పరుగులు.. భారత్కు 9 వికెట్లు కావాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!