ధోనీ, కోహ్లీ కన్నా గంగూలీనే అత్యుత్తమం: అక్తర్
టీమ్ఇండియా ఉత్తమ సారథుల్లో సౌరభ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ముందువరసలో ఉంటారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరు అత్యుత్తమం అని అడిగితే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా ఉత్తమ సారథుల్లో సౌరభ్ గంగూలీ, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ముందు వరుసలో ఉంటారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరు అత్యుత్తమం అని అడిగితే పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్.. దాదా పేరునే ఎంచుకున్నాడు. తాజాగా అతడు ఓ క్రీడా ఛానెల్తో ముచ్చటించిన సందర్భంగా పలు ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలిచ్చాడు. అందులో భాగంగానే మాజీ సారథి గంగూలీనే టీమ్ఇండియాకు అత్యుత్తమ కెప్టెన్ అని అక్తర్ అభిప్రాయపడ్డాడు.
మరోవైపు తాను బౌలింగ్ చేసిన అత్యంత కష్టమైన బ్యాట్స్మెన్ ఎవరని అడిగిన ప్రశ్నకు ఆల్టైమ్ స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ పేరు చెప్పాడు. ఈ విషయంలో జోక్ చేయట్లేదన్నాడు. ‘‘నేను బౌలింగ్ చేసిన వారిలో శ్రీలంక మాజీ స్పిన్నర్ మురళీధరనే అత్యంత కష్టతరమైన బ్యాట్స్మన్. ఈ విషయంలో జోక్ చేయట్లేదు. అతను నా వద్దకొచ్చి ‘బౌన్సర్లతో నన్ను చంపొద్ద’ని కోరేవాడు. నేను బౌన్సర్ విసిరితే అతను చస్తానన్నాడు. బంతిని కాస్త పైకి విసిరితే వికెట్ ఇస్తానని చెప్పేవాడు. అలా అతను చెప్పినట్లే నేను బంతి వేయగానే దాన్ని కొట్టేవాడు. తర్వాత నా వద్దకొచ్చి ‘అనుకోకుండా కొట్టాన’ని చెప్పేవాడు’’ అని అక్తర్ వివరించాడు. మరి ఇది నిజమో కాదో వాళ్లిద్దరికే తెలియాలి. ఇక కోల్కతాలో సచిన్ను ఔట్ చేసింది ఇష్టమా లేక తన ఫాస్టెస్ట్ డెలివరీ (161 కిమీ వేగం 2003 ప్రపంచకప్లో) ఇష్టమా అని అడిగిన ప్రశ్నకు అతడు తెందూల్కర్ వికెట్కే ప్రాధాన్యమిచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
-
మంత్రి కాకాణి అనుచరుడి రైస్ మిల్లులో మద్యం స్వాధీనం
-
జగనన్న నవ్వులు.. జనాలకు చుక్కలు
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. కూలీ బిడ్డకు 993 మార్కులు
-
ఏ ముఖం పెట్టుకుని రాజధాని రైతులను సీఎం ఓట్లు అడుగుతారు
-
ఒకే బైక్పై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి