T20 World Cup:రోహిత్ శర్మ ఇండియా కా ఇంజమామ్: షోయబ్ అక్తర్
భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ముంగిట పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మని ప్రశంసలతో ముంచెత్తాడు. హిట్ మ్యాన్ని పాక్ మాజీ కెప్టెన్ ఇంజామమ్ ఉల్ హక్తో పోల్చాడు. పాకిస్థాన్లో రోహిత్ని ‘ఇండియా కా ఇంజిమామ్’అని
ఇంటర్నెట్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 ప్రపంచకప్ మ్యాచ్ ముంగిట పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత ఓపెనర్ రోహిత్ శర్మని ప్రశంసలతో ముంచెత్తాడు. హిట్ మ్యాన్ని పాక్ మాజీ కెప్టెన్ ఇంజామమ్ ఉల్ హక్తో పోల్చాడు. పాకిస్థాన్లో రోహిత్ని ‘ఇండియా కా ఇంజిమామ్’ అని పిలుస్తారని పేర్కొన్నాడు.
‘‘నేను రోహిత్ శర్మతో 2013లో మాట్లాడా. ‘చూడు. నీలాగా క్రీజులో ఎక్కువ సమయం గడిపేవాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. నీ సామర్థ్యాన్ని నువ్వు అర్థం చేసుకో’ అని అతడికి చెప్పా. చివరకు అతడు తన సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని ఉపయోగించుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. భారత క్రికెట్లోని సూపర్స్టార్స్లో రోహిత్ ఒకడు. అతడికున్న టైమింగ్, హిట్టింగ్ పవర్ మరెవరికీ లేదు. అతడు అద్భుతమైన ఆటగాడు. రోహిత్ శర్మ ఇండియా ఇంజామామ్ ఉల్ హక్’అని షోయబ్ అక్తర్ హిట్మ్యాన్ని ప్రశంసించాడు.
అక్టోబరు 24న (ఆదివారం) భారత్, పాక్ మధ్య జరగనున్న మ్యాచ్ గురించి అక్తర్ మాట్లాడాడు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ నుంచి పాక్కు ప్రమాదం పొంచి ఉందని, వారిని తేలిగ్గా తీసుకోవద్దని పాకిస్థాన్ పేసర్లను హెచ్చరించాడు. ‘భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ గురించి పాక్ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. వారిద్దరూ చెలరేగి ఆడి మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల మీద ఒత్తిడి లేకుండా చేస్తారు’ అని అక్తర్ అన్నాడు. ఈ టీ20 ప్రపంచకప్ అనంతరం పొట్టి ఫార్మాట్లో కెప్టెన్సీ తప్పుకుంటానని విరాట్ కోహ్లి ప్రకటించడంపై అక్తర్ స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ చాలా ఆశయాలతో ప్రపంచకప్కు వెళ్తున్నాడు. టీ20 కెప్టెన్సీని కప్ కొట్టి ముగించాలనుకుంటున్నాడు. కాబట్టి ఒత్తిడికి లోనవుతాడు. అతడు అనవసరమైన ఒత్తిడికి గురికాకూడదు. నా ఆశీస్సులు అతడికి ఉంటాయి. కోహ్లి తన టీ20 కెప్టెన్సీని ఉన్నతంగా ముగించాలని కోరుకుంటున్నా. అతడు కూడా అదే ఆశిస్తున్నాడు’ అని షోయబ్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి