Saurav Ganguly: కోహ్లీకి షోకాజ్ నోటీసులుపంపాలనుకున్న గంగూలీ!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట.
ఇంటర్నెట్డెస్క్: తన ఆటతీరుతో విరాట్ కోహ్లీ భారత జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడనంలో ఎలాంటి సందేహం లేదు. విజయవంతమైన కెప్టెన్గా కోట్ల మంది అభిమానుల మనసులు గెలుచుకున్న కోహ్లీ ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే బీసీసీఐ యాజమాన్యానికి, కోహ్లీకి పొసగడం లేదని తరచూ వార్తలు వస్తున్నాయి. అందుకే కోహ్లీ కెప్టెన్సీని వదులుకున్నాడని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఈ అంశాలకు ఆజ్యం తాజాగా కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. కోహ్లీ టీ20 సారథ్య బాధ్యతల నుంచి వైదొలిగిన అనంతరం.. దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరేముందు విలేకరుల సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశంలో తనపై జరుగుతున్న ప్రచారంపై కోహ్లీ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని చెబితే తననెవరూ ఆపలేదని తెలిపాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే ఒకానొక సందర్భంలో ఈ వ్యాఖ్యలతో ఏకీభవించని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు సిద్ధమయ్యాడట. విలేకరుల సమావేశంలో కోహ్లీ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని గంగూలీ భావించాడట. అయితే షోకాజు నోటీసులు పంపేముందు గంగూలీ ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షాకు తెలిపాడట. దీంతో ఆయన ఈ విషయం పెద్దది కాకుండా గంగూలీని ఒప్పించాడట. ప్రస్తుతం ఈ వార్త మీడియా వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సౌరభ్ గంగూలీతో సంబంధాలు దెబ్బతినడంతోనే విరాట్ కోహ్లీ అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్గా వైదొలిగాడా అన్న ప్రశ్నలకు షోకాజు నోటీస్ అంశం బలాన్ని చేకూరుస్తోంది.
ఏం జరిగిందంటే..
2021లో జరిగిన పొట్టి ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం చెందడంతో కోహ్లీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అనంతరం బీసీసీఐ సెలక్షన్ కమిటీ కోహ్లీని వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించింది. వన్డే, టీ20లకు భిన్న సారథ్యం సరికాదన్న వాదనను బీసీసీఐ తెరపైకి తీసుకొచ్చింది. రెండు ఫార్మాట్లకు కెప్టెన్లుగా వేరువేరుగా ఉంటే జట్టుపై తీవ్రప్రభావం పడుతుందని పేర్కొంది. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్గా, టెస్టులకు వైస్ కెప్టెన్గా రోహిత్ను నియమించింది. ఈ సమయంలో బీసీసీఐ నుంచి మీడియాకు కొన్ని లీకులు వెళ్లడం కోహ్లీని మనస్తాపానికి గురిచేశాయి. తనపై జరుగుతున్న ప్రచారానికి దక్షిణాఫ్రికాకు వెళ్లే ముందు విలేకరుల సమావేశంలో పలు ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. తనని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడానికి గంటన్నర ముందు మాత్రమే సమాచారం ఇచ్చారని, టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని ఎవరూ చెప్పలేదని అన్నాడు. కెప్టెన్సీ వదులుకోవద్దంటూ కోహ్లీతో తాను మాట్లాడానని అంతకుముందు గంగూలీ చేసిన ప్రకటనకు ఇది పూర్తిగా విరుద్ధంగా ఉంది. అప్పట్లో కోహ్లీ ప్రకటన భారత క్రికెట్లో ప్రకంపనలు సృష్టించింది. ఇక మూడు టెస్టుల సిరీస్లో భారత్ తొలి మ్యాచ్ గెలవగా, దక్షిణాఫ్రికా రెండో మ్యాచ్ గెలిచింది. ఇక కీలక మూడో టెస్టుకు జట్టును ఎంపిక చేయడంలో ముసలం పుట్టినట్లు తెలిసింది. మూడో టెస్టుకు ఆజింక్య రహానెకు బదులుగా శ్రేయస్ అయ్యర్ను తుది జట్టులోకి తీసుకోవాలని కోహ్లీ సూచించినట్లు తెలిసింది. కోచ్ ద్రవిడ్ మాత్రం రహానె వైపు మొగ్గుచూపడం.. అందుకు బీసీసీఐ పెద్దలు మద్దతు పలకడంతో కోహ్లీని మనస్తాపానికి గురైనట్లు సమాచారం. జట్టు ఎంపికలో, తుది జట్టు కూర్పులో తన ప్రమేయం లేకుండా పోవడంతో కోహ్లీ మూడో టెస్ట్ అనంతరం టెస్ట్ ఫార్మాట్కు కెప్టెన్గా వీడ్కోలు పలికినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి