IPL 2021: చెలరేగిన కోహ్లీ సేన.. 111 పరుగులకే ముంబయి ఆలౌట్
ముంబయి ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ జట్టు 54 పరుగుల తేడాతో గెలిచింది.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి ఇండియన్స్ ఈ అంచెలో వరుసగా మూడోసారి ఓటమిపాలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 111 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఆర్సీబీ 54 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముంబయి ఆటగాళ్లలో రోహిత్ శర్మ (43; 28 బంతుల్లో 5×4, 1×6) ఒక్కడే రాణించగా మిగతా అందరూ విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు, చాహల్ మూడు, మ్యాక్స్వెల్ రెండు, సిరాజ్ ఒక వికెట్ తీశారు.
హర్షల్ పటేల్ హ్యాట్రిక్..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లి (51; 42 బంతుల్లో 3×4, 3×6), మ్యాక్స్వెల్ (56; 37 బంతుల్లో 6×4, 6×3) రాణించారు. 166 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ముంబయికి ఓపెనర్లు శుభారంభం అందించారు. తొలి రెండు ఓవర్లు కాస్త నెమ్మదిగా ఆడిన ముంబయి ఆటగాళ్లు తర్వాత జోరు పెంచారు. జేమీసన్ వేసిన మూడో ఓవర్లో రోహిత్ వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. తర్వాత డేనియల్ క్రిస్టియన్ వేసిన ఓవర్లో రెండు బౌండరీలు బాదిన డికాక్ (24) చాహల్ వేసిన ఏడో ఓవర్లో మ్యాక్స్వెల్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మ్యాక్స్వెల్ వేసిన 10వ ఓవర్లో చివరి బంతికి రోహిత్.. పడిక్కల్కి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్(9), కృనాల్ పాండ్య (5), సూర్యకుమార్ యాదవ్(8) కుడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ఇక 17వ ఓవర్లో హర్షల్ పటేల్ అద్భుతమే చేశాడు. హార్దిక్ పాండ్య(3), కీరన్ పొలార్డ్ (7), రాహుల్ చాహర్(0)లను వరుస బంతుల్లో ఔట్ చేసి హ్యాట్రిక్ తీశాడు. చాహల్ వేసిన 18 ఓవర్లో బుమ్రా(5) పెవిలియన్ చేరగా.. హర్షల్ పటేల్ వేసిన 18.1 బంతికి మిల్నే(0) ఔటవడంతో ముంబయి 111 పరుగులకు ఆలౌటైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.