Afghan Crisis: కుటుంబాన్ని తరలించలేక కుమిలిపోతున్న రషీద్ఖాన్
అఫ్గాన్లో నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ఖాన్ ఆవేదనకు గురవుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. రషీద్ తన కుటుంబాన్ని తరలించలేక కుమిలిపోతున్నట్లు పీటర్సన్ పేర్కొన్నాడు....
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నారు. దీంతో వారికి భయపడి వేలాది మంది ప్రజలు అఫ్గాన్ను వదిలి ఇతర దేశాలకు తరలిపోతున్నారు. కాబుల్ ఎయిర్పోర్ట్ కిక్కిరిసిపోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు తెలుస్తోంది. దీంతో కాబుల్కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. కాగా అఫ్గాన్లో నెలకొన్న పరిస్థితులపై ఆ దేశ స్టార్ క్రికెటర్ రషీద్ఖాన్ ఆవేదనకు గురవుతున్నట్లు ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ వెల్లడించాడు. రషీద్ తన కుటుంబాన్ని తరలించలేక కుమిలిపోతున్నట్లు పీటర్సన్ పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్లో ప్రస్తుతం జరుగుతున్న ‘హండ్రెడ్’ టోర్నీలో రషీద్ఖాన్ ట్రెంట్ రాకెట్స్ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే పీటర్సన్ స్పందించాడు. ‘అఫ్గానిస్థాన్లో అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయమై రషీద్తో చాలాసేపు చర్చించా. అతడు చాలా బాధపడుతున్నాడు. తన కుటుంబాన్ని అఫ్గాన్ నుంచి తరలించలేకపోయాడు. ఈ విషయమై అతడు కుమిలిపోతున్నాడు’ అని పీటర్సన్ వెల్లడించాడు. ఈ ఒత్తిడి నుంచి రషీద్ బయటపడాలని పీటర్సన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
అఫ్గానిస్థాన్లో శాంతిని నెలకొల్పేందుకు ప్రపంచ నేతలు చొరవ తీసుకోవాలని ఈమధ్యే రషీద్ ఖాన్ విజ్ఞప్తి చేశాడు. తమను అరాచకత్వంలో వదిలేయొద్దని.. పిల్లలు, మహిళలు సహా పౌరులు ప్రాణాలు కోల్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆస్తినష్టం విపరీతంగా జరుగుతోందని ఆందోళన చెందాడు. అఫ్గానిస్థాన్ నాశనాన్ని ఆపేయాలని, తమకు శాంతి కావాలని రషీద్ ట్విటర్ వేదికగా కోరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు