ఆ ముగ్గురి కాంబినేషన్.. కొత్త శిఖరాలకు భారత క్రికెట్: హర్భజన్
భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత క్రికెట్ను మరింత ఉన్నతస్థాయికి ...
ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మార్గదర్శకత్వంలో సారథులు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భారత క్రికెట్ను కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు. ద్రవిడ్ కోచ్గా ఉండటం వల్ల జట్టులోని ఆటగాళ్లకు భరోసా, స్థిరత్వం వస్తుందని పేర్కొన్నాడు. ‘‘ఒకటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. రాహుల్ రావడంతో ఆటగాళ్లకు వారి ప్రదర్శనపై నమ్మకం కలుగుతుంది. జట్టులో స్థానంపై భరోసా ఉంటుంది. యువకులకు మంచి అవకాశాలు వస్తాయి. ఎలాంటి అన్యాయం జరగదు. అకారణంగా జట్టు నుంచి మిమ్మల్ని (క్రికెటర్లనుద్దేశించి) తప్పించరు. చాలా అవకాశాలను కల్పించేందుకు రాహుల్ ప్రయత్నిస్తాడు. జట్టులో స్థిరత్వం తీసుకొస్తాడు’’ అని వివరించాడు.
కొత్త కోచ్ ద్రవిడ్, కెప్టెన్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య కుదురుకోవడానికి కాస్త సమయం పట్టొచ్చని హర్భజన్ అంచనా వేశాడు. అలాగే ద్రవిడ్ను కోచ్గా నియమించడంపై మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా మేనేజ్మెంట్ను అభినందించాడు. రాహుల్ ద్రవిడ్కి కోహ్లీ గౌరవం ఇస్తాడని, తనకు కూడా కావాలని విరాట్ డిమాండ్ చేయడని పేర్కొన్నాడు. ‘‘క్రికెటర్గా భారత జట్టుకు ఏం చేశాడు.. వ్యక్తిగతంగా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడనేదే రాహుల్లో కోహ్లీ చూస్తాడు. టెస్టు మ్యాచ్లకు వస్తే రాహుల్ హృదయం దగ్గరగా ఉండే ఫార్మాట్ ఇదే. ఈ విషయం కోహ్లీకి కూడా తెలుసు. చాలా మ్యాచ్ల సందర్భంగా చెప్పాడు’’ అని ఆకాశ్ చోప్రా తెలిపాడు. కివీస్తో రెండు టెస్టుల సిరీస్కు టీమ్ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం నుంచి కాన్పూర్ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే తొలి టెస్టుకు అందుబాటులో ఉండని కోహ్లీ స్థానంలో రహానె సారథ్యం వహిస్తాడు.
పిచ్ ఎలా ఉండనుందంటే?
భారత్, కివీస్ జట్ల మధ్య తొలి టెస్టు జరిగే కాన్పూర్ స్టేడియం సిద్ధమైపోయింది. అనువైన పిచ్ను తయారు చేయాలని భారత ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, సారథి అజింక్య రహానె నుంచి ఎలాంటి సూచనలు అందలేదని క్యూరేటర్ శివకుమార్ వెల్లడించారు. ఉత్తమమైన పిచ్ను రూపొందించామని పేర్కొన్నాడు. నవంబర్ నెలలో పిచ్ మీద కొంత తేమ ఉంటుందని, అయితే ట్రాక్ దృఢంగా ఉండి పగుళ్లు రావని మాత్రం చెప్పగలనని తెలిపాడు. ఆతిథ్యం దేశం జట్టు తమకు అనువుగా ఉండే పిచ్లను తయారు చేయించుకుంటూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో కేవలం మూడు రోజులకే మ్యాచ్లు ముగుస్తున్న సంఘటనలను చూస్తున్నామని, ఇక్కడ మాత్రం అలా జరగదని గ్యారంటీ ఇచ్చాడు. అయితే రెండో రోజు నుంచి కాస్త బంతి టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని క్యూరేటర్ శివకుమార్ వివరించారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం