Racism: మైకెల్ వాన్పై ‘జాత్యహంకార’ ఆరోపణలు.. బీబీసీ షో నుంచి తొలగింపు
తన వెటకారపు కామెంట్లతో టీమ్ఇండియా క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ‘జాత్యహంకార’ఆరోపణలతో...
ఇంటర్నెట్ డెస్క్: తన వెటకారపు కామెంట్లతో టీమ్ఇండియా క్రికెట్ అభిమానుల ఆగ్రహానికి గురయ్యే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ ‘జాత్యహంకార’ఆరోపణలతో వార్తల్లో నిలిచాడు. ప్రపంచవ్యాప్తంగా ‘రేసిజం’కు వ్యతిరేకంగా తీవ్ర ఆందోళనలు, సంఘీభావాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్ మ్యాచుల సందర్భంగానూ అన్ని జట్లు క్రీడాకారులు జాత్యహంకారానికి వ్యతిరేకంగా చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపారు. ఈ క్రమంలో ‘రేసిజం’ సెగ ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ను తాకింది. మైకెల్ వాన్ తమపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు అజీమ్ రఫీక్ సహా మరొక ఆటగాడు ఆరోపించారు. దీంతో తమ షో నుంచి వాన్ను తొలగించినట్లు, సంఘటనపై విచారణకు ఆదేశించామని బీబీసీ వెల్లడించింది. బీబీసీలో విశ్లేషకుడిగా మైకెల్ వాన్ టెస్ట్ మ్యాచ్ స్సెషల్ ‘ద టఫర్స్ అండ్ వాన్ క్రికెట్ షో’ని 12 ఏళ్లుగా నిర్వహిస్తున్నాడు. అయితే అజీమ్ రఫీక్ చేసిన ‘రేసిజం’ ఆరోపణలతో గత సోమవారం షోలో మైకెల్ వాన్ కనిపించలేదు. 2009లో నాటింగ్హామ్షైర్, యార్క్షైర్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా తనతోపాటు మరొక ఆటగాడిపై మైకెల్ వాన్ జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు రఫీక్ ఆరోపించాడు. జాత్యహంకార వ్యాఖ్యలకు సంబంధించి రఫీక్ చేసిన ఆరోపణలపై దర్యాప్తును సిద్ధమేనని మైకెల్ వాన్ ప్రకటించాడు. అయితే తాను అలాంటి వ్యాఖ్యలు చేసినట్లు వస్తున్న ఆరోపణలను తిరస్కరించాడు.
ఇంగ్లాండ్కి కెప్టెన్గా వ్యవహరించిన మైకెల్ వాన్ 1991 నుంచి 2009లో రిటైర్మెంట్ వరకు యార్క్షైర్ కౌంటీకీ ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం విశ్లేషకుడిగా మారిపోయాడు. భారత్కు సంబంధించిన గెలుపోటములపై తనదైన వ్యంగ్యాస్త్రాలను సంధిస్తూ ఉంటాడు. 2009లో నాటింగ్హామ్షైర్, యార్క్షైర్ మ్యాచ్ను విశ్లేషిస్తూ.. ‘‘మీరు (ఆసియా క్రీడాకారులు) చాలా మంది ఉన్నారు.. మేం దాని గురించి ఏదైనా చేయాలి’’ అంటూ మైకెల్ వాన్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు రఫీక్ ఆరోపించాడు. ప్రొఫెషనల్గా రఫీక్కు అదే తొలి ఏడాది కావడం గమనార్హం. అయితే వాటిపై మైకెల్ వాన్ స్పందిస్తూ.. ‘‘అలాంటి పదాలు వాడినట్లు వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండిస్తున్నా. దాచిపెట్టేందుకు ఏమీ లేదు. ‘మీరు చాలామంది’అని వ్యాఖ్యానించడం మాత్రం ఎప్పటికీ జరగదు’’ అని స్పష్టం చేశాడు. ఆ పదాలను తాను వాడలేదని మాత్రం గట్టిగా నమ్ముతున్నానని మైకెల్ వాన్ చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!