Olympics: పతకం తెస్తే ₹కోట్లు.. ఏయే దేశాలెంత ప్రకటించాయో తెలుసా?
ఒలింపిక్స్లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా
ఇంటర్నెట్ డెస్క్: ఒలింపిక్స్లో పాల్గొనాలనేది అథ్లెట్ల కల. ఈ మహాక్రీడల్లో గెలుపొంది పతకం సాధించే క్రీడాకారులు తమ పేరునే కాదు.. వారి దేశ ప్రతిష్ఠను సైతం ప్రపంచానికి తెలియజేసినవారవుతారు. అందుకే, అథ్లెట్లు పతకాలు గెలుపొందితే దేశాలు, స్థానిక ప్రభుత్వాలు ప్రోత్సాహకంగా నగదు బహుమతులు అందజేస్తుంటాయి. ఈ సారి కూడా ఒలింపిక్స్లో పతకాలు తెచ్చేవారికి ప్రభుత్వాలు నజరానా ప్రకటించాయి. మన దేశంలోనే కాదు.. పలు దేశాలు కూడా పతకాలు గెలిచిన వారికి నగదు బహుమతి ఇవ్వబోతున్నాయి.
భారత్లోని వివిధ రాష్ట్రాల నుంచి 120 మంది దాకా అథ్లెట్లు ఈ సారి ఒలింపిక్స్లో పాల్గొంటున్నారు. అయితే, ఎన్ని పతకాలు వస్తాయనేది ఇప్పుడే చెప్పలేం కానీ, పతకాలు తెస్తే నగదు బహుమతులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. స్వర్ణ పతకం గెలిస్తే రూ.75 లక్షలు, రజతం గెలిస్తే రూ.40 లక్షలు, కాంస్యం గెలిస్తే రూ.25 లక్షలు ఇస్తామని తెలిపింది. మరోవైపు తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్కు వెళ్లిన అథ్లెట్లు స్వర్ణ పతకం తెస్తే రూ.6 కోట్లు, రజతం తెస్తే రూ.4 కోట్లు, కాంస్యం తెస్తే రూ.2-2.5 కోట్లు అందజేస్తామని హరియాణా, ఉత్తర్ప్రదేశ్, ఛత్తీస్ఘడ్, ఒడిశా, ఛండీగఢ్ ప్రకటించాయి. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాలు స్వర్ణ పతక విజేతలకు రూ.5 కోట్లు చొప్పున ఇవ్వనున్నాయి. దిల్లీ ప్రభుత్వం బంగారు పతకాలు తెచ్చిన వారికి రూ.3 కోట్లు ఇవ్వనుంది. ఇతర దేశాలతో పోలిస్తే పతకాలు గెలిచే అథ్లెట్లకు ఇచ్చే నగదు బహుమతి భారత్లోనే అత్యధికంగా ఉండటం విశేషం.
ఇక ఇతర దేశాల విషయానికొస్తే.. బంగారు పతకం గెలిచిన క్రీడాకారులకు ఇండోనేషియా 7,46,000 డాలర్లు (రూ.5.55కోట్లు), సింగపూర్ 735,000 డాలర్లు (రూ.5.47 కోట్లు), హాంకాంగ్ 644,000 డాలర్లు (రూ.4.80కోట్లు), థాయ్లాండ్ 309,000 డాలర్లు (2.30కోట్లు), కజకిస్థాన్ 250,000 డాలర్లు (రూ.1.86కోట్లు), ఇటలీ 212,000 డాలర్లు (1.58కోట్లు) నగదు బహుమతి ప్రకటించాయి. అగ్రరాజ్యం అమెరికా పతకాలు తెచ్చేవారికి ఇచ్చే నజరానా చాలా తక్కువ. స్వర్ణం గెలిచే అమెరికన్ అథ్లెట్కు 37,500 డాలర్లు (రూ.28లక్షలు) ప్రకటించగా.. ఆతిథ్య దేశం జపాన్ 45,200 డాలర్లు (రూ.34లక్షలు) ఇవ్వనుంది. ఇక ఫ్రాన్స్ 65,000 డాలర్లు (రూ.48లక్షలు), రష్యా 61,000 డాలర్లు (రూ.45లక్షలు), బ్రెజిల్ 47,500 డాలర్లు (రూ.35లక్షలు), దక్షిణాఫ్రికా 37,000 (రూ.27.5లక్షలు) నెదర్లాండ్స్ 35,400 డాలర్లు (రూ.26లక్షలు), జర్మనీ 22,000 డాలర్లు (రూ.16లక్షలు), కెనడా 16,000 డాలర్లు (రూ.12లక్షలు), ఆస్ట్రేలియా 15,100 డాలర్లు (రూ.11లక్షలు) నజరానాగా ఇవ్వబోతున్నట్లు వెల్లడించాయి.
బ్రిటన్, నార్వే, స్వీడన్ దేశాలు మాత్రం అథ్లెట్లకు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. దానికి బదులుగా ఒలింపిక్స్, పారాఒలింపిక్స్ క్రీడల కోసం ఏటా 160 మిలియన్ డాలర్లు కేటాయిస్తున్నాయి. ఈ డబ్బుతో అథ్లెట్లకు శిక్షణ, స్టైఫండ్ ఇస్తున్నారు. నగదు ప్రోత్సాహకాలు ఇవ్వడం వల్ల అథ్లెట్లలో క్రీడా స్ఫూర్తి రాదని బ్రిటన్ నమ్మకం. అందుకే నజరానా ఇవ్వడానికి విముఖుత చూపుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?