జులై 13న ‘ఒలింపిక్స్’ క్రీడాకారులతో మోదీ సమావేశం
టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్లో వివిధ విభాగాల్లో పోటీ పడి భారత్కు పతకాలు సాధించిపెట్టాలని ఉవ్విలూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ క్రీడాకారులను ఉత్సాహ పర్చేందుకు ప్రాధానమంత్రి నరేంద్ర మోదీ వారితో
దిల్లీ: టోక్యో ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిథ్యం వహించేందుకు క్రీడాకారులు సిద్ధమయ్యారు. జులై 23 నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్లో వివిధ విభాగాల్లో పోటీ పడి భారత్కు పతకాలు సాధించిపెట్టాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ క్రీడాకారులను ఉత్సాహ పర్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారితో సమావేశం కానున్నారు. జులై 13న ఒలింపిక్స్లో పాల్గొనే అథ్లెట్లతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమవుతారని ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఒలింపిక్స్లో పాల్గొనబోతున్న అథ్లెట్లలో స్ఫూర్తి నింపడం కోసం ప్రధాని వారితో మాట్లాడతారని పేర్కొంది.
భారత్ తరఫున 18 విభాగాల్లో పాల్గొనేందుకు మొత్తం 126 మంది అథ్లెట్లు ఒలింపిక్స్లో ఆడేందుకు వెళ్తున్నారని, అత్యధికంగా ఇంతమంది అథ్లెట్లను పంపడం ఇదే తొలిసారని పీఎంవో తెలిపింది. తొలిసారి ఫెన్సింగ్ విభాగంలో భారత్(భవానీ దేవి) పాల్గొనబోతుందని గుర్తు చేసింది. ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్గా నేత్ర కుమారన్ నిలిచిందని, అలాగే.. భారత్ తరఫున స్విమ్మింగ్ విభాగంలో పాల్గొనేందుకు సాజన్ ప్రకాశ్, శ్రీహరి నటరాజ్ తొలిసారి అర్హత సాధించారని పీఎంవో తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.