T20 World Cup: స్కాట్లాండ్పై పాక్ ఘన విజయం
పాకిస్థాన్ మరోసారి సత్తాచాటింది. వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించింది. స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ 72 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్ మరోసారి సత్తాచాటింది. టీ20 ప్రపంచకప్ సూపర్ 12 గ్రూప్2లో వరుసగా 5 మ్యాచుల్లో విజయం సాధించి పాక్ అగ్రస్థానంలో నిలిచింది. షార్జా వేదికగా స్కాట్లాండ్తో జరిగిన మ్యాచ్లో పాక్ 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 189 పరుగులు చేసింది. బాబర్ అజామ్ (66), షోయబ్ మాలిక్ (54 నాటౌట్) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం 190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 117 పరుగుల చేసింది. స్కాట్లాండ్ జట్టులో బెరింగ్టన్ (54 నాటౌట్) టాప్స్కోరర్. మిగతావారు విఫలమవడంతో ఆ జట్టు 117 పరుగులకే పరిమితమైంది. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు వికెట్లు తీయగా, హసన్ అలీ, షహీద్ అఫ్రిదీ, రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు. షోయబ్ మాలిక్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చింది.
షోయబ్ మాలిక్ సిక్సర్ల మోత..
టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ బాబర్ అజామ్ (66: 47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు), షోయబ్ మాలిక్ ( 18 బంతుల్లో 54*: ఒక ఫోర్, 6 సిక్సర్లు) అద్భుత అర్ధశతకాలతో చెలరేగడంతో పాక్ భారీ స్కోరు సాధించింది. తొలుత నిదానంగా ఆడిన పాక్.. ఆఖర్లో చెలరేగింది. మహమ్మద్ రిజ్వాన్ (15)తో కలిసి ఇన్నింగ్స్ను ప్రారంభించిన బాబర్ మొదట్లో ఆచితూచి ఆడాడు. ఫఖర్ జమాన్ (8) విఫలం కాగా.. మహమ్మద్ హఫీజ్ (31) ధాటిగా ఆడాడు. అయితే ఆఖర్లో మాలిక్ విశ్వరూపం చూపాడు. స్కాట్లాండ్ బౌలర్లలో గ్రీవ్స్ 2.. తహిర్, షరిఫ్ చెరో వికెట్ తీశారు.
సెమీస్లో తలపడనున్న జట్లు..
టీ20 ప్రపంచకప్లో సెమీస్లో తలపడే జట్లు ఖరారు అయ్యాయి. ఈ నెల 10న గ్రూప్ 1లో మొదటి స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్, గ్రూప్ 2లో రెండో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ మధ్య తొలి సెమీస్ జరగనుండగా, 11న గ్రూప్ 2లో మొదటి స్థానంలో నిలిచిన పాకిస్థాన్, గ్రూప్1లో రెండోస్థానంలో నిలిచిన ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీస్ జరగనుంది. ఇక గ్రూప్2లో భారత్-నమీబియా మధ్య మరో మ్యాచ్ మిగిలింది. అయితే ఇది నామమాత్రపు మ్యాచే. ఇప్పటికే గ్రూప్2లో పాక్ వరుసగా ఐదు విజయాలతో అగ్రస్థానంలో నిలవగా, నాలుగు విజయాలతో న్యూజిలాండ్ రెండో స్థానంలో నిలిచి సెమీస్కు చేరుకున్నాయి. న్యూజిలాండ్పై అఫ్గానిస్థాన్ జట్టు ఒక వేళ గెలిచి ఉంటే భారత్కు సెమీస్ చేరుకునే అవకాశం ఉండేంది. ఆ జట్టు ఓటమితో భారత్ ఆశలు గల్లంతయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా