T20 World Cup: పగ తీర్చుకున్న కివీస్.. ఫైనల్లో అడుగు
టీ20 ప్రపంచకప్లో భాగంగా తొలి సెమీఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టు అదరగొట్టింది. ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్లో న్యూజిలాండ్ అదరగొట్టింది. ఐసీసీ టోర్నీల్లో ఇంగ్లాండ్ గండాన్ని న్యూజిలాండ్ ఎట్టకేలకు దాటింది. 2016 టీ20 ప్రపంచకప్లో సెమీస్, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లీష్ జట్టులో చేతిలోనే కంగుతిన్న కివీస్ ఈ టీ20 ప్రపంచకప్ సెమీస్లో ఆ జట్టుని చిత్తు చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకుంది. మోర్గాన్ సేన నిర్దేశించిన 167 పరుగుల లక్ష్యాన్ని కివీస్ 19 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించి పొట్టి ప్రపంచకప్లో మొదటిసారి ఫైనల్కు దూసుకెళ్లింది. డారిల్ మిచెల్ (72; 47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లు) విధ్వంసం సృష్టించాడు. డేవిన్ కాన్వే (46; 38 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో వోక్స్, లివింగ్ స్టోన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. అదిల్ రషీద్ ఒక వికెట్ తీశాడు. న్యూజిలాండ్ గెలుపులో కీలక పాత్ర పోషించిన మిచెల్కు ప్లేయర్ ఆఫ్ ది అవార్డ్ వచ్చింది.
లక్ష్యఛేదనకు దిగిన న్యూజిలాండ్కు ఆదిలోనే ఎదురుదెబ్బలు తగిలాయి. తొలి ఓవర్లో గప్తిల్ (4), మూడో ఓవర్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (5) వెనుదిరగడంతో న్యూజిలాండ్ కష్టాల్లో పడింది. కాన్వేతో కలిసి మిచెల్ ఇన్నింగ్స్ని గాడిలో పెట్టాడు. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. దీంతో పది ఓవర్లకు 58/2తో నిలిచింది కివీస్. దీంతో న్యూజిలాండ్ ఓటమి దిశగా పయనిస్తోందని అంతా భావించారు. కానీ 11 ఓవర్ నుంచి కివీస్ ఆటగాళ్లు గేర్లు మార్చి ఆడారు. వీలుచిక్కినప్పుడల్లా ఫోర్లు, సిక్సర్లతో స్కోరు వేగాన్ని పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే లివింగ్ స్టోన్ వేసిన 14 ఓవర్లో కాన్వే ఔటయ్యాడు. తర్వాత వచ్చిన ఫిలిప్ (2) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. దీంతో ఇంగ్లాండ్ మళ్లీ పోటీలోకి వచ్చినట్లు కనిపించింది. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన జిమ్మీ నీషమ్ (27; 11 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్లు)తో కలిసి మిచెల్ వీరవిహారం చేశాడు. అదిల్ రషీద్ వేసిన 18 ఓవర్లో చివరి బంతికి నీషమ్ పెవిలియన్ చేరాడు. అయితే అప్పటికి న్యూజిలాండ్ విజయానికి 12 బంతుల్లో 20 పరుగులు కావాలి. వోక్స్ వేసిన 19 ఓవర్లో మిచెల్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో ఒక ఓవర్ మిగిలుండగానే న్యూజిలాండ్ విజయతీరాలకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..