Bumrah-Harshal: డెత్ ఓవర్లలో బుమ్రా-హర్షల్ కలిస్తే.. బీభత్సమే సృష్టిస్తారు!
న్యూజిలాండ్పై రెండో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్ ప్రదర్శనపై...
విశ్లేషించిన డానియల్ వెటోరి, రాబిన్ ఉతప్ప
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్పై రెండో టీ20 మ్యాచ్లో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన హర్షల్ పటేల్ ప్రదర్శనపై క్రికెటర్ల నుంచి ప్రశంసలు కురుస్తున్నాయి. కివీస్ను కట్టడి చేయడంలో హర్షల్ (2/25) కీలక పాత్ర పోషించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. డెత్ ఓవర్లలో అత్యంత ప్రభావవంతంగా బౌలింగ్ చేశాడు. హర్షల్ బౌలింగ్ ప్రదర్శనపై ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో ఛానల్లో రాబిన్ ఉతప్ప విశ్లేషిస్తూ.. ‘‘జస్ప్రీత్ బుమ్రాతో కలిసి హర్షల్ డెత్ ఓవర్లలో (ఆఖరి ఐదు ఓవర్లు) ప్రమాదకరంగా మారతాడు. ఇది భారత టీ20 జట్టుకు ఎంతో బలం. ఒత్తిడి పరిస్థితుల్లోనూ బంతిని చక్కటి స్థానంలో సంధించే నైపుణ్యం హర్షల్ సొంతం. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కివీస్తో మ్యాచ్లో తన రెండో ఓవర్ తొలి బంతికే ఫిలిప్స్ భారీ సిక్సర్ కొట్టాడు. రెండో బంతికి నోబాల్గా వేశాడు. అయితే అక్కడే హర్షల్ నైపుణ్యం బయటపడింది. అద్భుతంగా పుంజుకుని ఫ్రీహిట్ బంతిని డాట్ చేయడం.. తర్వాతి బంతికే ఫిలిప్స్ను ఔట్ చేశాడు’’ అని వివరించాడు.
రాబిన్ ఉతప్ప విశ్లేషణను కివీస్ మాజీ కెప్టెన్ డానియల్ వెటోరి సమర్థించాడు. ఆఖరి ఓవర్లలో బుమ్రా బౌలింగ్కు హర్షల్ పటేల్ జతకలిస్తే భారత టీ20 జట్టు భీకరంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నాడు. ‘‘ఇప్పటికే డెత్ ఓవర్లలో బుమ్రా ప్రమాదకరమైన బౌలర్ అని తెలుసు. ఆఖరి ఓవర్లలో హర్షల్ పటేల్ కూడా బౌలింగ్ చేసే నైపుణ్యం పెంచుకుంటే మాత్రం పొట్టిఫార్మాట్లో టీమ్ఇండియా జట్టు బలోపేతమవుతుంది. మరో కొత్త బౌలర్ అవేశ్ ఖాన్ పవర్ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేయగలడు. ఎందుకంటే అతడు స్పెషలిస్ట్ బౌలర్గా టాప్ స్థానంలో ఉన్నాడు’ అని వెటోరీ విశ్లేషించాడు. ఇతర జట్లలోనూ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసేందుకు ఎక్కువ మంది బౌలర్లు లేరని, అయితే భారత్కు కనీసం ఇద్దరు ఉండటం వల్ల టీ20ల్లో టీమ్ఇండియా భీకరమైన జట్టుగా మారుతుందని వెటోరి అంచనా వేశాడు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య