Tim Southee: పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు కష్టపడ్డా: టిమ్ సౌథీ
తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్ బౌలర్....
ఇంటర్నెట్ డెస్క్: తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్లో భారత్ తక్కువ స్కోరుకే పరిమితం కావడంలో కివీస్ బౌలర్ టిమ్ సౌథీ (5/69) కీలక పాత్ర పోషించాడు. దీంతో టెస్టు కెరీర్లో 13వ సారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ సందర్భంగా టిమ్ సౌథీ మాట్లాడుతూ.. గత మూడేళ్లుగా విదేశాల్లో ఎక్కువగా పర్యటించడం కలిసొచ్చిందన్నాడు. అక్కడి పరిస్థితులను త్వరితగతిన అర్థం చేసుకోవడం వల్లే మంచి ప్రదర్శన చేయగలుగుతున్నట్లు వెల్లడించాడు. 2008లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన టిమ్ సౌథీ ఇప్పటి వరకు 80 టెస్టులు ఆడాడు. మొత్తం 315 వికెట్లు పడగొట్టాడు. ‘‘యువ క్రికెటర్గా ఉన్నప్పుడే ప్రపంచమంతా చుట్టిరావడం ఇప్పుడు కలిసొస్తుంది. ఆ పర్యటనల నుంచి ఎంతో నేర్చుకున్నా. వికెట్ల ఆకలి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే బాగా రాణించగలం. ఎక్కడ ప్రాతినిధ్యం వహించినా... నేర్చుకునేందుకు, మెరుగ్గా ఆడేందుకు మార్గాలను అన్వేషించాలి’’ అని చెప్పుకొచ్చాడు.
టెస్టుల్లో రాణించాలంటే ఎప్పటికప్పుడు నైపుణ్యాలకు సానపట్టాలని, ఎంతో సాధన చేయాలని టిమ్ సౌథీ సూచించాడు. ‘‘కొత్త బంతిని ఇరు వైపులా స్వింగ్ చేయగలిగాలి. పాత బంతితోనూ రాణించేందుకు తీవ్రంగా కృషి చేయాలి. వికెట్లు తీసేందుకు ఉన్న మార్గాలను ప్రయత్నించాలి. ఉపఖండం పిచ్లపైనా ఇదే విధంగా ఆడాల్సి ఉంటుంది. నా వరకైతే పాత బంతితో స్వింగ్ రాబట్టేందుకు చాలా కష్టపడ్డాను. దీంతో ఇప్పుడు ఓల్డ్ బాల్ను స్వింగ్ చేసే నైపుణ్యం సొంతం చేసుకున్నా’’ అని వివరించాడు. భారత్తో తొలి టెస్టులో సౌథీతోపాటు జేమీసన్ (3/91), అజాజ్ పటేల్ (2/90) రాణించారు. రెండో రోజు 258/4 స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగింటిని సౌథీనే తీశాడు. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 129 పరుగులు చేసింది. క్రీజ్లో ఓపెనర్లు టామ్ లాథమ్ (50*), విల్ యంగ్ (75*) ఉన్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
సూచీలకు వరుస నష్టాలు.. 22 వేల దిగువకు నిఫ్టీ
-
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
-
‘అంతరిక్షమూ’ యుద్ధ క్షేత్రమే : త్రిదళాధిపతి అనిల్ చౌహాన్
-
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
-
బెయిల్ కోసం.. కేజ్రీవాల్ మామిడి పండ్లు, స్వీట్లు తింటున్నారు: ఈడీ
-
రూ.27 అధిక వసూలు.. ఉబర్ ఇండియాకు రూ.28,000 జరిమానా