IPL 2021: స్వల్ప లక్ష్యం.. చెమటోడ్చి నెగ్గిన ముంబయి
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
అబుదాబి: వరుస ఓటముల తర్వాత ముంబయికి ఊరట. పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచులో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యాన్ని రోహిత్ సేన 19 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబయి జట్టులో సౌరభ్ తివారి (45: 37 బంతుల్లో 3x4, 2x6), హార్దిక్ పాండ్య(40 నాటౌట్: 4x4, 2x6) రాణించారు. చివరి ఓవర్లలో పాండ్య సిక్స్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ముంబయి విజయం తేలికైంది. అంతకు మందు ముంబయి బౌలర్లు 6 వికెట్లు తీసి పంజాబ్ను 135 పరుగులకే కట్టడి చేశారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన పొలార్డ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు.
పాండ్య మెరుపులు..
పంజాబ్ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఆదిలోనే కష్టాలు ఎదురయ్యాయి. జట్టు స్కోరు 16 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ(8), సూర్యకుమార్ యాదవ్(0)ను రవిబిష్ణోయ్ వరుస బంతుల్లో ఔట్ చేశాడు. దీంతో సౌరభ్ తివారి(45)తో జట్టు కట్టిన క్వింటన్ డికాక్(27) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. అడపాదడపా ఫోర్లు, సిక్స్లతో స్కోర్ను పెంచారు. ఈక్రమంలో 9.5 ఓవర్ల వద్ద డికాక్ షమీ బౌలింగ్లో ఔటయ్యాడు. దీంతో ముంబయి స్కోరు 10 ఓవర్లకు 62/3 గా నిలిచింది. ఇదే క్రమంలో 15.1 ఓవర్ల వద్ద అర్ధసెంచరీ దిశగా సాగుతున్న సౌరభ్ తివారి ఔటయ్యాడు. నాథన్ ఎలీస్ వేసిన బౌలింగ్ కీపర్కు చిక్కాడు. దీంతో క్రీజులోకి వచ్చిన పోలార్డ్తో జట్టు కట్టిన హార్దిక్ పాండ్య మొదట నెమ్మదిగా ఆడినప్పటికీ తర్వాత వేగం పెంచాడు. మహమ్మద్ షమి వేసిన 17 ఓవర్లో హార్దిక్ ఓ సిక్స్, ఓ ఫోర్ కొట్టాడు. 18 ఓవర్లలో పోలార్డ్(15) ఓ సిక్స్, ఫోర్ కొట్టడంతో ఇక ముంబయి లక్ష్యం చిన్నదైంది. ఇక రెండు ఓవర్లలో ముంబయికి 16 పరుగులు అవసరం కాగా ఇక 19 ఓవర్లో పాండ్య విశ్వరూపం చూపించాడు. రెండు ఫోర్లు, ఓ సిక్స్తో చెలరేగడంతో ముంబయి ఒక ఓవర్ ఉండగానే గెలుపొందింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్.. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. మార్క్రమ్ (42; 29 బంతుల్లో 6 ఫోర్లు), దీపక్ హుడా (28 ) రాణించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్ (21), మన్దీప్ సింగ్ (15) శుభారంభం అందించినప్పటికీ భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. పంజాబ్ 36 పరుగుల వద్ద మన్దీప్ సింగ్ ఔటయ్యాడు. తర్వాత కీరన్ పొలార్డ్ వేసిన ఓవర్లో పంజాబ్కి గట్టి షాక్ తగిలింది. ఒకే ఓవర్లో క్రిస్ గేల్ (1), కేఎల్ రాహుల్ ఔటయ్యారు. ఎనిమిదో ఓవర్లో నికోలస్ పూరన్ (2)ని బుమ్రా పెవిలియన్ పంపించాడు. దీంతో పంజాబ్ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కష్టాల్లో ఉన్న జట్టును మార్క్రమ్, దీపక్ హుడా ఆదుకున్నారు. బౌల్ట్ వేసిన 15వ ఓవర్లో మార్క్రమ్ వరుసగా రెండు ఫోర్లు బాదగా.. హుడా ఓ బౌండరీ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. ప్రమాదకరంగా మారుతున్న మార్క్రమ్ని రాహుల్ చాహర్ క్లీన్బౌల్డ్ చేశాడు. బుమ్రా వేసిన 19వ ఓవర్లో దీపక్ హుడా పొలార్డ్కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో పంజాబ్ 135 6 వికెట్లు కోల్పోయి 135 పరుగులకే పరిమితమైంది. ముంబయి బౌలర్లలో పొలార్డ్, బుమ్రా రెండు, రాహుల్ చాహర్, కృనాల్ పాండ్య తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
భళా పంత్!
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!