ఇంకెంత కాలం భయపడతాం?
ప్రాణాంతక కరోనా మహమ్మారికి ఇంకెంత కాలం భయపడాలని, ఎప్పుడో ఒకప్పుడు ఆ వైరస్ను దాటి ముందడుగు వేయాల్సి ఉంటుందని భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ అభిప్రాయపడింది...
కరోనాను దాటి ముందుకు సాగాలి
దిల్లీ: ప్రాణాంతక కరోనా మహమ్మారికి ఇంకెంత కాలం భయపడాలని, ఎప్పుడో ఒకప్పుడు ఆ వైరస్ను దాటి ముందడుగు వేయాల్సి ఉంటుందని భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ అభిప్రాయపడింది. ఏడాది విరామం తర్వాత తొలి బాక్సింగ్ టోర్నీలో పాల్గొనబోతున్న ఈ ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్.. డెంగ్యూ నుంచి పూర్తిగా కోలుకుని తిరిగి మునుపటి బలం అందుకున్నానని వెల్లడించింది. ‘‘కరోనా నేపథ్యంలో ప్రయాణం చేయడానికి ఇంతకుముందు భయపడ్డా. ఇప్పటికీ ఎంతో జాగ్రత్తతో ఉన్నా. కానీ ఇంకెంత కాలం ఇలా కరోనాకు భయపడుతూ ఉండాలి. ఏదో ఒక సమయంలో దీనికి ముగింపు పలకాలి. ఆ వైరస్ నా దరికి చేరకుండా మాస్కు ధరించడంతో పాటు వ్యక్తిగత శుభ్రత పాటిస్తూనే ఉన్నా’’ అని మేరీ తెలిపింది. వచ్చే నెల 1న స్పెయిన్లో ఆరంభం కానున్న బాక్సమ్ అంతర్జాతీయ టోర్నీలో ఈ 37 ఏళ్ల బాక్సర్ బరిలో దిగనుంది. నిరుడు ఆసియా అర్హత టోర్నీలో గెలిచి టోక్యో ఒలింపిక్స్ బెర్త్ దక్కించుకున్న తర్వాత ఆమె తలపడబోతున్న తొలి ఛాంపియన్షిప్ ఇదే.
‘‘ఇప్పడు నా శరీర స్థితి బాగుంది. అందరిలాగే 2020 నాకూ కఠినంగానే గడిచింది. డిసెంబర్లో డెంగ్యూ రావడంతో శక్తిని కోల్పోయా. బరువూ పెరిగా. గత నెలలో 59 కేజీల వరకూ ఉన్నా. కానీ ఆ తర్వాత 15 రోజుల శిక్షణలో శ్రమించి తిరిగి నా మునుపటి బరువుకు చేరుకున్నా. ఇప్పుడు నేను 52 కేజీల వరకూ ఉన్నా. కండరాలు కూడా బలపడ్డాయి. బెంగళూరులో శిక్షణ శిబిరం నిర్వహించడం మేలు చేసింది. అన్ని ఆరోగ్య ప్రమాణాల నడుమ సాధన కొనసాగింది’’ అని మేరీ చెప్పింది. వైరస్ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచ బాక్సింగ్ క్వాలిఫయర్స్ను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రద్దు చేయడంతో.. ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన బాక్సర్లు మాత్రమే ఆ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది. దీనిపై ఐఓసీ టాస్క్ఫోర్స్ అథ్లెట్ రాయబారి అయిన మేరీ స్పందిస్తూ.. ‘‘ప్రస్తుతం ఉన్న సవాళ్ల కారణంగానే ఆ టోర్నీని రద్దుచేశారు. ఒకవేళ ఆ నిర్ణయాన్ని నేను వ్యతిరేకించినా ఎలాంటి మార్పు ఉండేది కాదు. ఇప్పటికే ఒలింపిక్స్కు అర్హత సాధించిన బాక్సర్లు అదృష్టవంతులు. ఈ ఏడాది టోక్యోలో జరిగే ఆ క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంపై దృష్టి సారించా’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?