IND vs SA: మిడిలార్డర్ రాణించిఉంటే ఫలితం మరోలా ఉండేది: కేఎల్ రాహుల్
qదక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమిపై స్పందిస్తూ.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించి ఉంటే ఫలితం మరోలా...
ఇంటర్నెట్ డెస్క్ : ‘‘తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటాం. తర్వాతి మ్యాచ్లో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాం’’ అని టీమిండియా వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్ ముగిసిన అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడాడు. ఓటమిపై స్పందిస్తూ.. మిడిలార్డర్ బ్యాటర్లు రాణించి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అన్నాడు. మరోవైపు భారత్పై విజయం సాధించడంతో సఫారీ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా చెప్పాడు.
మేం ఆటను గొప్పగా ప్రారంభించాం. కానీ, మిడిలార్డర్లో కీలక భాగస్వామ్యాలను విడగొట్టలేకపోయాం. 20 - 25 ఓవర్ల వరకు మేమే ఆధిక్యంలో ఉన్నాం. ఆ తర్వాత ఆట అనూహ్యంగా మారిపోయింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లను నిలువరించలేకపోయాం. ఆఖర్లో 20 పరుగులు అదనంగా ఇచ్చినట్లనిపించింది. ఛేదనలో విరాట్, శిఖర్ ధావన్ మెరుగైన ఆటను ప్రదర్శించారు. నిలకడగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అయితే, సఫారీ బౌలర్లు కీలక సమయాల్లో వికెట్లు పడగొట్టి భారత్ని దెబ్బ తీశారు. మిడిలార్డర్ బ్యాటర్లు కాస్త కుదురుకుని ఉంటే ఫలితం మరోలా ఉండేది. చాలా కాలంగా మేం వన్డే క్రికెట్ ఆడలేదు. ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకుంటాం
- కేఎల్ రాహుల్, టీమిండియా కెప్టెన్
భారత్పై విజయం సాధించడం ద్వారా మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇన్నింగ్స్ సాంతం చాలా కష్టపడ్డాను. వాండర్ డస్సెన్కు సహకరిస్తూ నిలకడగా ఆడాను. అతని దూకుడు చూసి వేరే పిచ్పై ఆడుతున్నాడేమో అనిపించింది. మేమిద్దరం నెలకొల్పిన భాగస్వామ్యం మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించడంలో కీలకంగా వ్యవహరించింది. డెత్ ఓవర్లలో స్పిన్నర్ తబ్రెయిజ్ షంసి గొప్పగా బౌలింగ్ చేశాడు. కట్టుదిట్టంగా బంతులేస్తూ భారత బ్యాటర్లను నిలువరించాడు
- తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్
బొలాండ్ పార్క్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్లో దక్షిణాఫ్రికా జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే అదే వేదికపై 21న (శుక్రవారం) జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
-
స్మిత ఇంట సీతారాముల కల్యాణం.. నాని సందడి
-
కుప్పంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు.. కేక్ కట్ చేసిన నారా భువనేశ్వరి
-
భారత్లో ఎలాన్ మస్క్ పర్యటన వాయిదా
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్