IPL: మిగిలిన మ్యాచ్లు ఇంగ్లాండ్లో ఆడించాలి
కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్లో టీమ్ఇండియా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ పూర్తవగానే...
సెప్టెంబర్లో నిర్వహించాలని పీటర్సన్ కోరిక..
ఇంటర్నెట్డెస్క్: కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ 14వ సీజన్ అర్ధాంతరంగా నిలిచిపోవడంతో తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనేదానిపై ఆసక్తి పెరిగింది. సెప్టెంబర్లో టీమ్ఇండియా ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ పూర్తవగానే వీలైనంత త్వరగా మిగతా సీజన్ను కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు యూఏఈనే అనువైన వేదికగా భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, దీనిపై కచ్చితమైన సమాచారం లేకపోయినా గతేడాది అక్కడే ఈ టోర్నీని దిగ్విజయంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు కూడా అక్కడే ఏర్పాట్లు చేయాలనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా, ఇంగ్లాండ్ మాజీ సారథి కెవిన్ పీటర్సన్ మాత్రం మిగిలిన ఐపీఎల్ సీజన్ను ఇంగ్లాండ్లో నిర్వహించాలని అభిప్రాయపడ్డాడు. ఓ క్రీడా సంస్థకు రాసిన కథనంలో ఈ విషయాన్ని పేర్కొన్నాడు. ‘సెప్టెంబర్లో యూఏఈలో మిగిలిన మ్యాచ్లు నిర్వహించాలని, అందుకు అదే సరైన వేదికని పలువురు మాట్లాడుకుంటుండటం నేను గమనించాను. అయితే, నేను మాత్రం ఆ మెగా ఈవెంట్ను ఇంగ్లాండ్కు తరలించాలని అనుకుంటున్నాను. సెప్టెంబర్లో టీమ్ఇండియా, ఇంగ్లాండ్ జట్ల ఐదు టెస్టుల సిరీస్ తర్వాత కాస్త విరామం దొరికింది. ఈ నేపథ్యంలోనే టీమ్ఇండియా, ఇంగ్లాండ్ ప్రధాన ఆటగాళ్లంతా అక్కడే ఉంటారు. దాంతో అది సరైన వేదిక’ అని పీటర్సన్ పేర్కొన్నాడు.
ఆ కాలంలో ఇంగ్లాండ్లోని వాతావరణం అద్భుతంగా ఉంటుందని, దాంతో లండన్ సహా మాంచెస్టర్, బర్మింగ్హామ్, లీడ్స్ వేదికలుగా మ్యాచ్లు నిర్వహించొచ్చని చెప్పాడు. అలాగే అక్కడ మ్యాచ్లు చూసేందుకు ప్రజలకు అనుమతిస్తారని అన్నాడు. దాంతో ఐపీఎల్కు కొత్త ఉత్సాహం వస్తుందన్నాడు. మరోవైపు ఈ మెగా ఈవెంట్ను ఇప్పటికే యూఏఈ, దక్షిణాఫ్రికా దేశాల్లో నిర్వహించారని, అలాంటప్పుడు ఈసారి ఇంగ్లాండే సరైన వేదికని పీటర్సన్ వివరించాడు. కాగా.. ఇంతకుముందే మిడిల్సెక్స్, సుర్రే, వార్విక్షైర్, లాంకషైర్ లాంటి కౌంటీ క్రికెట్ క్లబ్లు మిగిలిన ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించడానికి ఆసక్తిచూపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పీటర్సన్ అవే మాటలనడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు