IPL 2022 : భారత్లోనే ఐపీఎల్ 2022 మ్యాచ్లు.. కానీ..!
భారతీయ క్రికెట్ అభిమానులకు ఆనందంతోపాటు కాస్త నిరుత్సాహానికి గురి చేసే...
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ క్రికెట్ అభిమానులకు ఆనందంతోపాటు కాస్త నిరుత్సాహానికి గురి చేసే వార్త.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ ) 2022 సీజన్ మ్యాచ్లను భారత్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. అయితే కొవిడ్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండానే మ్యాచ్లు జరుగుతాయని సమాచారం. ‘‘భారత్లోనే ఐపీఎల్ 2022 పోటీలు జరుగుతాయి. కరోనా నేపథ్యంలో ప్రేక్షకులు లేకుండా టోర్నమెంట్ను నిర్వహిస్తాం. ముంబయిలోని వాంఖడే స్టేడియం, డీవై పాటిల్ స్టేడియంలోనే మ్యాచ్లు నిర్వహించేందుకు చూస్తున్నాం. అవసరమైతే పుణె మైదానాన్ని కూడా పరిశీలిస్తాం’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
ఐపీఎల్ మెగా వేలం కోసం ఇప్పటికే ఆటగాళ్ల రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. మొత్తం 1,214 మంది ప్లేయర్లు (896 మంది భారతీయులు, 318 మంది విదేశీయులు) రిజిస్టర్ చేసుకున్నారు. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో బెంగళూరు వేదికగా రెండు రోజులపాటు మెగా వేలం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె