IND vs ENG: ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు వర్షం అడ్డంకి.. భారత్‌ రెండు వికెట్లు డౌన్‌

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 53

Published : 01 Jul 2022 17:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక టెస్టులో టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌లో భోజన విరామ సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది. ఆరంభంలోనే వికెట్లు పడగొట్టి, ప్రత్యర్థిని ఆత్మరక్షణలోకి నెట్టాలనే వ్యూహంతో టాస్‌ గెలిచిన స్టోక్స్‌.. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఓపెనర్లు శుభమన్‌ గిల్‌ (17), ఛెతేశ్వర్‌ పూజారా (13) వికెట్లను పేసర్‌ జేమ్స్‌ అండర్సన్‌ పడగొట్టాడు. ఇద్దరూ అతడి బౌలింగ్‌లోనే స్లిప్‌లో ఉన్న జాక్‌ క్రాలీకి క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగారు. అయితే పూజారా ఔట్‌ అయిన కాసేపటికే మ్యాచ్‌కి వరుణుడు అంతరాయం కలిగించాడు. ఈ క్రమంలో అంపైర్లు భోజన విరామం ప్రకటించారు. ప్రస్తుతం కోహ్లీ (1), హనుమ విహారి (14) క్రీజ్‌లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని