IND vs ENG: తొలి రోజు ముగిసిన ఆట.. ఇంగ్లాండ్ స్కోర్ 53/3
ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 53/3 పరుగులతో నిలిచింది. డేవిడ్ మలన్(26), ఓవర్టన్(1) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టులో మొదటి రోజు ఆట ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 53/3 పరుగులతో నిలిచింది. డేవిడ్ మలన్(26), ఓవర్టన్(1) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ ఇంకా 138 పరుగుల వెనుకంజలో ఉంది. ఓపెనర్లు రోరీ బర్న్స్(5), హసీమ్ హమీద్(0)లను బుమ్రా ఇన్నింగ్స్ ఒకే ఓవర్లో ఔట్ చేశాడు. భారత బౌలర్లలో బుమ్రా 2, ఉమేశ్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్.. తొలి ఇన్నింగ్ప్లో 191 పరుగులకే ఆలౌట్ అయింది. టీమ్ఇండియా టాప్ ఆర్డర్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ(50) కాస్త ఫర్వాలేదనిపించగా.. మిగిలిన బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. శార్దూల్ ఠాకూర్(57; 36 బంతుల్లో 4×7, 6×3) వేగంగా పరుగులు రాబట్టాడు. రోహిత్ శర్మ(11), కేఎల్ రాహుల్(17), పుజారా(4), జడేజా(10),రహానె(14), రిషభ్ పంత్ (9) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరారు. ఇంగ్లాండ్ బౌలర్లలో క్రిస్వోక్స్ నాలుగు, రాబిన్సన్ మూడు వికెట్లు తీయగా అండర్సన్, ఓవర్టన్ చెరో వికెట్ తీశారు.
నిరాశపర్చిన టాప్ఆర్డర్
టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. మ్యాచ్ ప్రారంభమైన గంటకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. తొలుత క్రిస్వోక్స్ రోహిత్ శర్మ(11)ను ఔట్ చేయగా తర్వాత రాబిన్సన్.. కేఎల్ రాహుల్(17)ను వికెట్లముందు దొరకబుచ్చుకున్నాడు. కాసేపటికే అండర్సన్.. చెతేశ్వర్ పుజారా(4)ను సైతం పెవిలియన్ చేర్చి భారత్ను గట్టి దెబ్బతీశాడు. దాంతో టీమ్ఇండియా 38 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆపై కోహ్లీ, రవీంద్ర జడేజా(10) మరో వికెట్ పడకుండా తొలి సెషన్ను ముగించారు.
దూకుడుగా ఆడిన శార్దూల్..
అయితే, భోజన విరామం తర్వాత మరింత చెలరేగిన ఇంగ్లాండ్ పేసర్లు ఈసారి జడేజా, కోహ్లీ, రహానెను పెవిలియన్ పంపారు. ఐదో ఆటగాడిగా బరిలోకి దిగిన జడేజా బాగా ఆడతాడనుకున్నా విఫలమయ్యాడు. వోక్స్ బౌలింగ్లో స్లిప్లో రూట్ చేతికి చిక్కాడు. అనంతరం కోహ్లీ అర్ధశతకం పూర్తిచేసుకొని రాబిన్సన్ బౌలింగ్లో కీపర్కు చిక్కాడు. దాంతో భారత్ 105 పరుగులకు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం ఓవర్టన్ బౌలింగ్లో రహానె(14), వోక్స్ బౌలింగ్లో పంత్(9) కూడా విఫలమయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన శార్దూల్ ఠాకూర్.. ఉమేశ్ యాదవ్తో(10) కలిసి ఎనిమిదో వికెట్కు 63 పరుగులు జోడించాడు. అయితే, జట్టు స్కోర్ 190 పరుగుల వద్ద అతడు క్రిస్వోక్స్ ఔలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. భారత్ తర్వాతి రెండు వికెట్లను మరుసటి ఓవర్లోనే కోల్పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్