Team India : భారత జట్టులో మార్పులు అనివార్యం : రవిశాస్త్రి
టీమ్ఇండియా గత కొద్ది కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కుంటోంది. గత ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ కనీసం సెమీస్కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇటీవల దక్షిణాఫ్రికా..
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా గత కొద్ది కాలంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్లో భారత్ కనీసం సెమీస్కు కూడా చేరకుండానే నిష్క్రమించింది. ఇటీవల దక్షిణాఫ్రికా పర్యటనలో భాగంగా టెస్టు, వన్డే సిరీస్లో ఘోర పరాజయం పాలైంది. ఇదే సమయంలో భారత జట్టులో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. రవిశాస్త్రి స్థానంలో రాహుల్ ద్రవిడ్ హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టడం.. విరాట్ కోహ్లీ నుంచి రోహిత్ శర్మ వన్డే పగ్గాలను అందుకోవడం స్వల్ప వ్యవధిలోనే జరిగిపోయాయి. మరోవైపు, గాయాల కారణంగా కీలక ఆటగాళ్లు దూరం కావడం కూడా జట్టు ప్రదర్శనపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాబోయే వన్డే, టీ20 ప్రపంచకప్లకు చాలా తక్కువ సమయం ఉందని.. ఆలోపు భారత జట్టులో మార్పుచేర్పులు చేసి టీమ్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత జట్టునే ప్రపంచకప్ వరకు కొనసాగించడం చాలా కష్టమని పేర్కొన్నాడు.
‘రాబోయే 8-10 నెలల కాలం భారత క్రికెట్కు చాలా ముఖ్యం. ఈ కొద్ది సమయంలోనే కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు జట్టు యాజమాన్యం.. మరో నాలుగైదేళ్లు టీమ్ఇండియాకు సేవలందించగల ఆటగాళ్లను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనుభవమున్న ఆటగాళ్లతో పాటు యువ ఆటగాళ్లను కూడా జట్టులో భాగం చేయాలి. అప్పుడే జట్టుకు సమతూకం వస్తుంది. భారత క్రికెట్ దృష్ట్యా మార్పులు అనివార్యం. అందుకు ఇదే సరైన సమయం. ప్రస్తుత జట్టుతోనే ప్రపంచకప్ వరకు కొనసాగితే.. ఆ తర్వాత జట్టులో మార్పులు చేయడం చాలా కష్టమవుతుంది’ అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు