Dingko Singh: అతనే నా హీరో: మేరీకోమ్
భారత బాక్సింగ్ ఛాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకోసింగ్ గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఇంపాల్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు...
అతణ్ణి చూసేందుకు క్యూలో నిలబడేదాన్ని..
ఇంటర్నెట్డెస్క్: భారత బాక్సింగ్ ఛాంపియన్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత డింకోసింగ్ గురువారం కన్నుమూశారు. కొంత కాలంగా లివర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఈరోజు ఇంఫాల్లోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. భారత్లో బాక్సింగ్కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిన డింకోసింగ్ ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలిచారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో ఆరుసార్లు విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన మేరీకోమ్ లాంటి దిగ్గజానికి సైతం ఆయనే స్ఫూర్తి నింపడం విశేషం. ఆయన మృతి పట్ల మేరీతో పాటు పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
* డింకో ఒక రాక్స్టార్, ఒక దిగ్గజం. మణిపూర్లో అతను బరిలోకి దిగి ప్రత్యర్థులను చిత్తుచేసే సమయంలో నేను క్యూలో నిలబడి చూసేదాన్ని. అతనే నా స్ఫూర్తి ప్రదాత. నా హీరో. అతని మరణం తీరనిలోటు. చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోయారు. జీవితం అస్సలు ఊహించలేనిది. -మేరీకోమ్
* మనమో బాక్సింగ్ దిగ్గజాన్ని కోల్పోయాం - వికాస్ కృష్ణ (ఒలింపిక్స్ పోటీదారుడు)
* భారత బాక్సింగ్లో డింకోసింగ్ లేనిలోటు పూడ్చలేనిది. కొన్ని తరాల బాక్సర్లకు ఆయనో స్ఫూర్తిప్రదాత. భవిష్యత్ తరాలకు సైతం అతని చరిత్ర ఇలాగే కొనసాగుతుంది. ఇలాంటి కష్టసమయంలో బాక్సింగ్ బృందం మొత్తం డింకో కుటుంబసభ్యులకు అండగా నిలుస్తుంది. -అజయ్ సింగ్ (భారత బాక్సింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు)
* డింకోసింగ్ మరణం పట్ల తీవ్రంగా కలతచెందాను. భారత్ తీర్చిదిద్దిన మేటి బాక్సర్లలో ఆయనొకరు. 1998 బ్యాంకాక్ ఆసియా క్రీడల్లో అతను సాధించిన స్వర్ణ పతకం భారత్లో కొత్త ఊపిరిపోసింది. -కిరణ్ రిజిజు (కేంద్ర క్రీడల శాఖా మంత్రి)
* బాక్సింగ్ రింగ్లో అతనో ప్రత్యేకమైన వ్యక్తి. ఎంతో నైపుణ్యం ఉన్న బాక్సర్. కానీ ఉన్నత శిఖరాలకు చేరకపోవడం దురదృష్టకరం. -జి. సంధు (జాతీయ మాజీ కోచ్)
* ఆయన జీవన ప్రయాణం, ఎదుర్కొన్న కష్టాలు భావితరాలకు ఒక పాఠంలా నిలిచిపోతాయి. - విజేందర్ సింగ్ (బాక్సింగ్లో భారత తొలి ఒలింపిక్స్ పతక విజేత)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం