Jhulan Goswami: ఝులన్కు వీడ్కోలు.. ఏడ్చేసిన కెప్టెన్ హర్మన్ ప్రీత్
టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి తన సుదీర్ఘ ప్రయాణం నేటితో ముగియనుంది. కెరీర్లో నేడు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది.........
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా మహిళా క్రికెట్ జట్టు సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి తన సుదీర్ఘ క్రికెట్ ప్రయాణం నేటితో ముగియనుంది. కెరీర్లో నేడు చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతోంది. ఈ వీడ్కోలు మ్యాచ్కి ముందు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కంటతడి పెట్టింది. లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్తో జరుగుతున్న చివరిదైన మూడో వన్డే టాస్కి ముందు జట్టు సభ్యులు ఝులన్ గురించి మాట్లాడి ఆమెకు జ్ఞాపికలు అందజేశారు. ప్రేక్షకులు కరతాళ ధ్వనులతో సీనియర్ పేసర్కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్ భావోద్వేగానికి గురై ఝులన్ను హత్తుకొని కంటతడి పెట్టింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను గోస్వామితోపాటు బీసీసీఐ మహిళా అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. ఝులన్ కెప్టెన్సీలోనే హర్మన్ అరంగేట్రం చేయడం విశేషం.
తన రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో.. మూడు ఫార్మాట్లలో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది ఝులన్. 12 టెస్టుల్లో 44 వికెట్లు, 68 టీ20ల్లో 56 వికెట్లను తన ఖాతాలో వేసుకున్న ఆమె 204 వన్డేల్లో 253 వికెట్లు పడగొట్టి ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉంది. మరే ఇతర బౌలర్ కూడా ఆమె దరిదాపుల్లో లేరు. మరెవరూ 200 మార్కును దాటలేదు. ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు (43) తీసిన రికార్డు కూడా ఆమె పేరిటే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి