MS Dhoni : ధోనీ అత్యంత చురుకైన క్రికెట్ మేధావి.. మాజీ సారథిపై ఛాపెల్ ప్రశంసల జల్లు
భారతీయ క్రికెట్ అభిమానులకు గ్రెగ్ ఛాపెల్ గుర్తుండే ఉంటాడు కదా.. భారత ప్రధాన కోచ్గా....
ఇంటర్నెట్ డెస్క్: భారతీయ క్రికెట్ అభిమానులకు గ్రెగ్ ఛాపెల్ గుర్తుండే ఉంటాడు కదా.. భారత ప్రధాన కోచ్గా (2005-2007) రెండేళ్ల పాటు పని చేసిన ఛాపెల్ వివాదాస్పద నిర్ణయాల దెబ్బకు హేమాహేమీలైన క్రికెటర్లే కుదేలైన సంగతి తెలిసిందే. తాజాగా ఓ క్రికెట్ ఛానెల్తో గ్రెగ్ మాట్లాడుతూ.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోనే అత్యంత చురుకైన క్రికెట్ మేధావిగా ధోనీని అభివర్ణించాడు. ‘‘నిర్ణయాలు తీసుకోవడంలో ధోనీది అద్భుతమైన నైపుణ్యం. ఇదే అతడి సమకాలీనుల్లో ధోనీని ప్రత్యేకంగా నిలిపింది. ప్రణాళికలను రచించడంలో ఎంతో చురుగ్గా ఉంటాడు. కొద్దికాలం ధోనితో కలిసి పనిచేశా. టాలెంట్ను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఫ్యాషన్తో ఆటను ఆడిన వ్యక్తి ధోనీ’’ అని ఛాపెల్ పేర్కొన్నాడు.
‘‘అభివృద్ధి చెందిన క్రికెట్ దేశాలు ఆటకు సంబంధించిన సహజత్వాన్ని కోల్పోతున్నాయి. టాప్ ప్లేయర్ల క్రికెట్ను చూస్తూ యువకులు ఆటను నేర్చుకోవడం, స్నేహితులతో కలిసి ఆడటం వంటి పరిస్థితులు క్రమంగా దెబ్బతింటున్నాయి. భారత్ వంటి ఉపఖండ దేశంలో ఇప్పటికీ చాలా పట్టణాల్లో కోచింగ్కు సంబంధించి సౌకర్యాలు పెద్దగా లేవు. చాలా మంది యువకులు ఎలాంటి కోచ్ సాయం లేకుండా బయటి ప్రదేశాల్లో ఆడేస్తుంటారు. టీమ్ఇండియాలో చాలా మంది స్టార్ ఆటగాళ్లు ఇలా ఆడి నేర్చుకున్నవారే. వారిలో ముఖ్యంగా రాంచీ పట్టణం నుంచి వచ్చిన ఎంఎస్ ధోనీ గురించి మాట్లాడుకోవాలి. అంతర్జాతీయంగా నేర్చుకునే దశలో వివిధ పిచ్ల మీద అనుభవజ్ఞులతో కలిసి ఆడినప్పుడు తనకు తాను వృద్ధి చెందిన విధానం అద్భుతం. కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం, స్ట్రాటజిక్ నైపుణ్యాలను ఒడిసిపట్టుకోవడం వల్ల తన సమకాలీనుల్లో ధోనీ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు’’ అని వివరించాడు. టీమ్ఇండియా తరఫున దాదాపు 15 ఏళ్లపాటు (2004-2019) ప్రాతినిధ్యం వహించిన ఎంఎస్ ధోనీ.. నాయకుడిగా టీ20 ప్రపంచకప్ (2007), వన్డే వరల్డ్కప్ (2011)ను భారత్కు అందించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్