దబంగ్‌ దిల్లీ జోరు

ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో  సీజన్‌లో దబంగ్‌ దిల్లీ జోరు కొనసాగుతోంది. మంగళవారం మ్యాచ్‌లో ఆ జట్టు 32-29 తేడాతో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ట్యాక్లింగ్‌లో ఆధిపత్యం చలాయించిన దిల్లీ

Published : 19 Jan 2022 02:39 IST

బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్‌ ఎనిమిదో  సీజన్‌లో దబంగ్‌ దిల్లీ జోరు కొనసాగుతోంది. మంగళవారం మ్యాచ్‌లో ఆ జట్టు 32-29 తేడాతో పట్నా పైరేట్స్‌పై గెలిచింది. ట్యాక్లింగ్‌లో ఆధిపత్యం చలాయించిన దిల్లీ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ఆ జట్టు తరపున విజయ్‌ (9) రైడింగ్‌లో రాణించగా.. సందీప్‌ నర్వాల్‌ (8) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో మెరిశాడు. చివరి రైడ్‌లో ప్రత్యర్థిని పట్టేసిన మంజీత్‌ చిల్లర్‌ జట్టును గెలిపించాడు. గుజరాత్‌ సూపర్‌ జెయింట్స్‌, యు ముంబా మధ్య హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్‌ 24-24తో టైగా ముగిసింది. గుజరాత్‌ తరపున అజయ్‌ (7).. ముంబా జట్టులో అజిత్‌ (8) రాణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని