సాత్విక్ జోడీకి 8వ ర్యాంకు
ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్లో తమ స్థానాన్ని మెరుగు పరుచుకుంది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన
దిల్లీ: ఇండియా ఓపెన్లో విజేతగా నిలిచిన భారత అగ్రశ్రేణి డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజు- చిరాగ్ శెట్టి ప్రపంచ ర్యాంకింగ్స్లో తమ స్థానాన్ని మెరుగు పరుచుకుంది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో సాత్విక్- చిరాగ్ జోడీ రెండు స్థానాలు ఎగబాకి 8వ ర్యాంకు సాధించింది. 2019 నవంబరులో సాత్విక్- చిరాగ్ జోడీ తమ కెరీర్లో అత్యుత్తమంగా ఏడో ర్యాంకులో నిలిచింది. పురుషుల సింగిల్స్లో యువ ఆటగాడు లక్ష్యసేన్ కెరీర్లో అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. ఇండియా ఓపెన్ టైటిల్ గెలుచుకున్న లక్ష్యసేన్ నాలుగు స్థానాలు మెరుగు పరుచుకుని 13వ ర్యాంకు సొంతం చేసుకున్నాడు. కిదాంబి శ్రీకాంత్ పదో స్థానంలో నిలిచాడు. మహిళల సింగిల్స్లో పి.వి.సింధు ఏడో ర్యాంకుతో కొనసాగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
-
గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపు.. తోషిబాలోనూ 5,000 మంది!
-
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
-
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఫిర్యాదు.. కేసీఆర్ అన్న కుమారుడిపై మరో కేసు
-
మణి అన్నపురెడ్డిని ఎందుకు పట్టుకోవట్లేదు?
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?