Zaheer-Southee: టిమ్ సౌథీ తీసుకున్న నిర్ణయమే సరైంది: జహీర్ ఖాన్
మూడు టీ20ల సిరీస్లో భాగంగా నిన్న (బుధవారం) జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో ....
ఇంటర్నెట్ డెస్క్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా నిన్న (బుధవారం) జరిగిన తొలి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో టీమ్ఇండియానే గెలుపు వరించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 164/6 స్కోరు సాధించింది. అనంతరం భారత్ 19.4 ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి అతికష్టంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆఖరి నాలుగు ఓవర్లలో కేవలం 23 పరుగులు మాత్రమే చేయాల్సిన తరుణంలో కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. 17వ ఓవర్లో రెండు పరుగులు, 18వ ఓవర్లో ఐదు పరుగులు, 19వ ఓవర్లో ఆరు పరుగులను మాత్రమే ఇచ్చారు. దీంతో ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి పది పరుగులు అవసరం కాగా.. కివీస్ పార్ట్టైమ్ బౌలర్ డారిల్ మిచెల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసినా.. వెంకటేశ్ అయ్యర్ (4), పంత్ (17*) రెండు ఫోర్లను కొట్టడంతో టీమ్ఇండియా 19.4 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేయగలిగింది. న్యూజిలాండ్ రెగ్యులర్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ సిరీస్కు విశ్రాంతి తీసుకోవడంతో టిమ్ సౌథీ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు స్వీకరించాడు. ఘనవిజయం సాధిస్తుందేలే అనుకున్న టీమ్ఇండియాను సౌథీ తన కెప్టెన్సీతో కాస్త కంగారు పెట్టించాడు. ఈ క్రమంలో టిమ్ సౌథీపై భారత మాజీ ఫాస్ట్బౌలర్ జహీర్ఖాన్ ప్రశంసల వర్షం కురిపించాడు.
టీమ్ఇండియాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో తన బౌలర్లను చాలా చక్కగా వినియోగించుకున్నాడని కివీస్ కెప్టెన్ టిమ్ సౌథీని జహీర్ ఖాన్ అభినందించాడు. ప్రధాన బౌలర్లను కాదని, కీలకమైన ఆఖరి ఓవర్ను పార్ట్టైమ్ మీడియం పేసర్ డారిల్ మిచెల్కు ఇచ్చిన సౌథీ నిర్ణయం సరైంది కాదని పలువురు భావించినా... జహీర్ఖాన్ మాత్రం ఆ నిర్ణయాన్ని ప్రశంసించాడు. రెగ్యులర్ లెగ్ స్పిన్నర్ టాడ్ ఆస్టల్కు ఆఖరి ఓవర్ ఉన్నా.. మిచెల్ చేతికే బంతినిచ్చాడు. ఎందుకంటే అప్పటికే క్రీజ్లో ఎడమచేతివాటం బ్యాటర్లు రిషభ్ పంత్, వెంకటేశ్ అయ్యర్ ఉన్నారు. ఈ సమయంలో బౌండరీలు వచ్చేస్తాయని సౌథీ భావించి ఉంటాడని జహీర్ అంచనా వేశాడు. ‘‘సౌథీ తన టాప్ బౌలర్లతో కీలక సమయంలోనే బౌలింగ్ చేయించాడు. భారత్ టాప్ ఆర్డర్ బాగా ఆడటంతో ఒక దశలో సునాయాస విజయం సాధిస్తుందేమోనని భావించారు. అయితే గొప్పగా పుంజుకున్న సౌథీ బౌలింగ్ దళం మ్యాచ్ను చివరి ఓవర్ వరకు తీసుకురావడంలో విజయవంతమయ్యారు. అందుకే సౌథీ కెప్టెన్సీని అభినందించాల్సిందే’’ అని జహీర్ వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!