IND vs NZ: లేథమ్ సెంచరీ మిస్.. కివీస్ నడ్డివిరిచిన అక్షర్ పటేల్
భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లేథమ్...
ఇంటర్నెట్ డెస్క్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్లో న్యూజిలాండ్ ఓపెనర్ టామ్ లేథమ్ (282 బంతుల్లో 95: 10X4) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కివీస్ నడ్డి విరిచిన అక్షర్ పటేల్ బౌలింగ్లో స్టంప్ ఔటయ్యాడు. మూడో రోజు రెండో సెషన్ ముగిసేసరికి కివీస్ ఆరు వికెట్ల నష్టానికి 249 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్లో టామ్ బ్లండెల్ (10*), జేమీసన్ (2*) ఉన్నారు. అంతకుముందు 129/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన కివీస్ దూకుడుకు భారత బౌలర్లు అడ్డుకట్ట వేశారు. మరో ఇరవై రెండు పరుగులు జోడించాక విల్ యంగ్ (89) వికెట్ను చేజార్చుకుంది. అశ్విన్ బౌలింగ్లో కీపర్ శ్రీకర్ చేతికి క్యాచ్ ఇచ్చి యంగ్ పెవిలియన్కు చేరాడు. తర్వాత క్రీజ్లోకి వచ్చిన కెప్టెన్ విలియమ్సన్ (18)ను ఉమేశ్ యాదవ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. స్వల్ప వ్యవధిలో రాస్ టేలర్ (11), హెన్రీ నికోల్స్ (2) ను అక్షర్ ఔట్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా లేథమ్ మాత్రం పట్టువిడవకుండా బ్యాటింగ్ చేశాడు. అయితే అక్షర్ బౌలింగ్లో భారీ షాట్ ఆడేందుకు వచ్చి స్టంప్ ఔట్గా వెనుదిరిగాడు. అనంతరం వచ్చిన రచిన్ రవీంద్ర (13)ను రవీంద్ర జడేజా క్లీన్ బౌల్డ్ చేశాడు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో భారత్ 345 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. దీంతో టీమ్ఇండియా కంటే కివీస్ ఇంకా 96 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ బౌలర్లలో అక్షర్ పటేల్ 3.. ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజా తలో వికెట్ తీశారు.
మూడు సార్లు డీఆర్ఎస్.. ఒకసారి మనోళ్లు రక్షించారు
నిన్న (రెండో రోజు) మూడు సార్లు డీఆర్ఎస్ను ఉపయోగించుకుని మరీ బతికిపోయిన లేథమ్ సెంచరీకి ఐదు పరుగుల దూరంలో ఔటైపోయాడు. ఇవాళ ఉదయం కూడా అశ్విన్ బౌలింగ్లో ఔటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఎల్బీడబ్ల్యూ కోసం అశ్విన్ అప్పీల్ చేసినా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. డీఆర్ఎస్ తీసుకునేందుకు భారత్ సారథి అజింక్య రహానె ఆసక్తి చూపలేదు. అయితే ట్రాక్ చెకింగ్లో మాత్రం ఔట్గా తేలింది. దీంతో అశ్విన్ కాస్త అసహనానికి గురయ్యాడు. డీఆర్ఎస్తో లేథమ్కు మూడు సార్లు అదృష్టం కలిసొచ్చిన అంశంపై కివీస్ ఆల్రౌండర్ జిమ్మీ నీషమ్ ట్విటర్ వేదికగా సరదాగా స్పందించాడు. ‘‘ఒక వేళ లేథమ్ సెంచరీ సాధిస్తే టీమ్ఇండియా డీఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయమంటుందేమో’’ అని ట్వీట్ చేశాడు. మరి లేథమ్ శతకం చేయలేదు కాబట్టి టీమ్ఇండియా డీఆర్ఎస్ను రద్దు చేయమని అడిగే అవకాశం ఉండదుగా..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.