IND vs NZ: నాలుగో రోజు భారత్దే ఆధిపత్యం.. ఆఖర్లో అశ్విన్ మాయ
అయితేతభారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసింది..
ఇంటర్నెట్ డెస్క్: టాప్ ఆర్డర్ విఫలమైనా మేమున్నామంటూ మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఇన్నింగ్స్ను నిలబెట్టారు.. ప్రత్యర్థి జట్టును నాలుగో రోజే కాస్త ఒత్తిడిలోకి నెడుతూ బౌలర్లు తొలి వికెట్ పడగొట్టారు.. ఇవాళ ఆరంభ సెషన్లో వెనుకబడినా సరే పుంజుకుని మరీ ఆఖరి రోజు సవాల్కు సిద్ధమని నిరూపించారు మన టీమ్ఇండియా క్రికెటర్లు..
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ నాలుగో రోజు ఆట ముగిసింది. 284 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి నాలుగు పరుగులు చేసింది. తొలుత బ్యాటింగ్లో రాణించిన టీమ్ఇండియా.. ఆఖర్లో కివీస్ వికెట్ తీసి నాలుగో రోజు ఆటలో ఆధిపత్యం కనబరిచింది. న్యూజిలాండ్ గెలవాంటే ఒక్క రోజు (90 ఓవర్లు)లో 280 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 345 పరుగులు చేయగా..రెండో ఇన్నింగ్స్లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ స్కోరు 296/10. దీంతో తొలి ఇన్నింగ్స్లో 49 పరుగుల ఆధిక్యంతో కలిపి మొత్తం టీమ్ఇండియా లీడ్ 283 పరుగులకు చేరింది.
భారత్ నిలబడటానికి కారణం వారే..
14/1తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియా 51 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టిమ్ సౌథీ, జేమీసన్ దెబ్బకు టీమ్ఇండియా బ్యాటర్లు హడలెత్తిపోయారు. అయితే శ్రేయస్ అయ్యర్ (65), అశ్విన్ (32) అర్ధశతక భాగస్వామ్యంతో భారత్ను ఆదుకున్నారు. అశ్విన్ ఔటైనా సాహా (61*)తో కలిసి అయ్యర్ ఇన్నింగ్స్ను నడిపించాడు. వీరిద్దరూ ఏడో వికెట్కు 64 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మరో శతకం చేస్తాడని భావించిన శ్రేయస్ దురదృష్టవశాత్తూ సౌథీ బౌలింగ్లో బంతి గ్లౌజ్కు తాకి కీపర్ చేతికి చిక్కాడు. అయితే అనంతరం క్రీజ్లోకి వచ్చిన అక్షర్ పటేల్ (28*)తో కలిసి సాహా మరో వికెట్ను పడనీయలేదు. అక్షర్-సాహా జోడీ ఎనిమిదో వికెట్కు అర్ధశతకం (67 పరుగులు) భాగస్వామ్యం నిర్మించారు. ఆధిక్యం 280 పరుగులు దాటడం.. ఆఖర్లో కేవలం నాలుగైదు ఓవర్లే పడనుండటంతో ఇన్నింగ్స్ను డిక్లేర్డ్ చేయాలని కెప్టెన్ అజింక్య రహానె నిర్ణయించాడు. దీంతో భారత్ రెండో ఇన్నింగ్స్లో 234/7 స్కోరు వద్ద డిక్లేర్డ్ అయింది.
ఆఖర్లో మనకు కలిసొచ్చిన అదృష్టం..
నాలుగో రోజు ఆటలో మొదటి సెషన్ మాత్రమే పర్యాటక జట్టుది. మిగతా రెండు సెషన్లు టీమ్ఇండియావే. రెండో సెషన్లో అయ్యర్, అశ్విన్.. మూడో సెషన్లో సాహా, అక్షర్ బ్యాటింగ్లో రాణించారు. మరీ ముఖ్యంగా భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ను చివర్లో అశ్విన్ తన మాయతో బోల్తా కొట్టించాడు. ఓపెనర్ విల్ యంగ్ (2)ను ఔట్ చేసి భారత్కు బ్రేక్ ఇచ్చాడు. యంగ్ ఎల్బీడబ్ల్యూ అయినట్లు అశ్విన్ అప్పీల్ చేయడంతో అంపైర్ ఔట్గా ప్రకటించాడు. అయితే బంతి వికెట్లను తాకలేదని డీఆర్ఎస్లో తేలింది. సమీక్షకు వెళ్లడంలో జాప్యం చేయడంతో విల్ పెవిలియన్కు చేరకతప్పలేదు. ఒకవేళ డీఆర్ఎస్కు వెళ్తే మాత్రం గ్యారంటీగా బతికిపోయేవాడే. ఇక ఆఖరి రోజు తొమ్మిది వికెట్లను పడగొట్టితే విజయం భారత్ వశమవుతుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు