IND vs NZ: ముగిసిన తొలి రోజు ఆట.. మూడు అర్ధశతకాలు నమోదు
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట..
మొదటి రోజు ఆధిపత్యం సాధించిన టీమ్ఇండియా
కాన్పూర్: సీమ్ బౌలింగ్కు అదరలేదు.. స్పిన్కు బెదరలేదు.. అనుభవం లేదని తలవంచనూలేదు.. ధనాధన్ బాదడమే కాదు.. సుదీర్ఘ ఫార్మాట్లోనూ సత్తాచాటుతామని నిరూపించారు మన భారత యువ క్రికెటర్లు.. కివీస్తో తొలి టెస్టు మొదటి రోజు ఆటలో ముగ్గురు అర్ధశతకాలు బాదేశారు. అదీ సమయోచితంగా నిలకడగా ఆడుతూనే సాధించారు. జట్టు కష్టాల్లో పడకుండా రక్షించారు.
సీనియర్ ప్లేయర్లు పుజారా, రహానెలను త్వరగానే ఔట్ చేసిన ఆనందం కివీస్కు దక్కకుండా చేసింది శుభ్మన్ (52), శ్రేయస్ అయ్యర్ (75*), రవీంద్ర జడేజా (50*).. మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గురించే. అంతర్జాతీయంగా జడేజాకు ఎలానూ అనుభవం ఉంది కాబట్టి నిలుదొక్కుకోవడంలో ఆశ్చర్యం లేదు. అయితే అరంగేట్రం చేసిన తొలి మ్యాచ్లోనే ఎంతో ఓపిగ్గా, అనుభవశీలిగా ఆడిన శ్రేయస్ను ఎంత పొగిడినా తక్కువే. అర్ధశతకం సాధించి నాటౌట్గా నిలిచిన శ్రేయస్ ఈ మ్యాచ్లోనే శతకం చేస్తే అది జీవితంలో మరిచిపోలేని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయిద్ది. అలా అని ఓపెనర్ శుభ్మన్ గిల్, మిడిలార్డర్లో జడేజా ఇన్నింగ్స్లను తక్కువ అంచనా వేయలేం.. ముగ్గురి బ్యాటింగ్తోనే భారత్ ప్రస్తుతానికి మంచి స్థితిలో నిలిచింది.
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట మరో ఆరు ఓవర్లు మిగిలి ఉండగానే ముగిసింది. టాస్ నెగ్గిన టీమ్ఇండియా సారథి అజింక్య రహానె బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ముగ్గురు బ్యాటర్లు అర్ధశతకాలు నమోదు చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసమయానికి టీమ్ఇండియా నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అరంగేట్ర బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (75నాటౌట్: 7 ఫోర్లు, 2 సిక్సర్లు), శుభ్మన్ గిల్ (52: 5 ఫోర్లు, ఒక సిక్స్), రవీంద్ర జడేజా (50 నాటౌట్: 6 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 13, ఛెతేశ్వర్ పుజారా 26, అజింక్య రహానె 35 పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో జేమీసన్ 3, సౌథీ ఒక వికెట్ పడగొట్టారు.
ఐదో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం
లంచ్ సమయానికి 82/1తో పటిష్ఠంగా ఉన్న టీమ్ఇండియాను జేమీసన్ దెబ్బకొట్టాడు. మంచి ఫామ్లో ఉండి అర్ధశతకం సాధించిన గిల్ను క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే స్వల్ప వ్యవధిలోనే పుజారా కివీస్ బౌలర్ సౌథీ బౌలింగ్లో టామ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అనంతరం క్రీజ్లోకి వచ్చిన శ్రేయస్తో కలిసి భారత సారథి అజింక్య రహానె కాస్త నిలదొక్కుకున్నట్లు కనిపించాడు. అయితే జేమీసన్ బౌలింగ్లో రహానె బోల్తాపడ్డాడు. క్లీన్బౌల్డ్గా వెనుదిరిగాడు. మరో వికెట్ కానీ పడితే టీమ్ఇండియా కష్టాల్లో పడేదే. అయితే శ్రేయస్-రవీంద్ర జడేజా శతక (113) భాగస్వామ్యం నిర్మించి రక్షించారు. ఆట చివర వరకు మరో వికెట్ పడనీయకుండా కాచుకున్నారు. దీంతో రెండో సెషన్లో పైచేయి సాధించిన కివీస్ బౌలర్లను మూడో సెషన్లో చిత్తు చేశారు. ఇదే క్రమంలో వీరిద్దరూ అర్ధశతకాలను నమోదు చేసుకున్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!