చారిత్రక విజయానికి అడుగు దూరంలో.. భారత్
సుధీర్ఘ టెస్టు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఐదు మ్యాచుల ఈ సిరీస్లో కోహ్లీసేన ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టులోనూ ప్రత్యర్థి జట్టును సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర..
మాంఛెస్టర్ : సుదీర్ఘ టెస్టు సిరీస్ తుది అంకానికి చేరుకుంది. ఐదు మ్యాచుల ఈ సిరీస్లో కోహ్లీసేన ఇప్పటికే రెండు మ్యాచుల్లో గెలిచి ఆధిక్యంలో కొనసాగుతోంది. చివరి టెస్టులోనూ ప్రత్యర్థి జట్టును సొంత గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు, ఎలాగైనా ఈ మ్యాచులో గెలిచి సిరీస్ను సమం చేయాలన్న పట్టుదలతో ఉంది ఇంగ్లాండ్ జట్టు. భారత్ చరిత్ర సృష్టిస్తుందో.. ఇంగ్లాండ్ సిరీస్ను సమం చేస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..!
సిరీస్లో ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. చివరి మ్యాచ్లో పలువురు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు సమాచారం. ఇప్పటికే, నాలుగు టెస్టుల్లో కలిపి 151 ఓవర్లు విసిరి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన పేసర్ జస్ప్రీత్ బుమ్రాను.. త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ దృష్ట్యా అతడిపై మరింత భారం వేయకుండా చివరి మ్యాచుకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. అలాగే, ఫామ్లేమితో సతమతమవుతున్న వైస్ కెప్టెన్ అజింక్య రహానెను పక్కన పెట్టే అవకాశం లేకపోలేదు. చివరి అవకాశంగా భావించి మరోసారి రహానెను ఆడించినా.. విఫలమైతే అతడి అంతర్జాతీయ కెరీర్ ప్రమాదంలో పడినట్టే. 33 ఏళ్ల రహానెను జట్టు నుంచి తప్పిస్తే భవిష్యత్లో మళ్లీ టెస్టు క్రికెట్ ఆడే అవకాశాలు తక్కువే. ఇప్పటికే, ఎంతో మంది యువ ఆటగాళ్లు ఒక్క అవకాశం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రహానెను పక్కన పెడితే అతడి స్థానంలో యువ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ లేదా హనుమ విహారిని తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.
మరో పేసర్ మహమ్మద్ షమి ఫిట్నెస్ నిరూపించుకోవడంతో.. తుది జట్టులో కచ్చితంగా ఆడే అవకాశం ఉంది. అయితే, ప్రధాన కోచ్ రవి శాస్త్రి, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కరోనా బారిన పడటంతో.. తుది జట్టులోకి ఎవరిని తీసుకుంటారనేది కెప్టెన్ కోహ్లీ నిర్ణయంపై ఆధార పడి ఉంది. గత మ్యాచులో ఆరు వికెట్లతో ఆకట్టుకున్న ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండ్ ప్రదర్శనతో మెరిసిన శార్ధూల్ ఠాకూర్ల స్థానాలకు ఢోకా లేదు. ఇక గత నాలుగు మ్యాచుల్లో రిజర్వ్ బెంచ్కే పరిమితమైన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ఈ మ్యాచులో ఆడే అవకాశం ఉంది. ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్థానంలో అశ్విన్కు అవకాశం ఇవ్వవచ్చు.
నాలుగో టెస్టులో పరాజయానికి దీటుగా బదులివ్వాలనే కసితో ఇంగ్గాండ్ బరిలోకి దిగనుంది. బెయిర్ స్టో స్థానంలో జట్టులోకి వచ్చిన జోస్ బట్లర్కి వైస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. గత మ్యాచుకు దూరం పెట్టిన మార్క్ వుడ్తో, క్రిస్ వోక్స్ బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. జేమ్స్ అండర్సన్, క్రేగ్ ఓవర్టన్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు.
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచుకు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది. తొలి రెండు రోజులు వర్షం కురిసే అవకాశం ఉంది. ఒక వేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే.. సిరీస్ భారత్ వశమవుతుంది. అదేగనుక జరిగితే ఆస్ట్రేలియా (2018-19), ఇంగ్లాండ్(2021)ల్లో టెస్టు సిరీస్ గెలిచిన ఏకైక భారత కెప్టెన్గా విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించనున్నాడు.
జట్లు..
టీమిండియా : విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, ఛెతేశ్వర్ పుజారా, మయాంక్ అగర్వాల్, అజింక్య రహానె, హనుమ విహారి, రిషభ్ పంత్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, వృద్ధిమాన్ సాహా, అభిమన్యు ఈశ్వరన్, పృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్, శార్థూల్ ఠాకూర్.
ఇంగ్లాండ్ : రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, మొయిన్ అలీ, జానీ బెయిర్ స్టో, జో రూట్, జోస్ బట్లర్, డాన్ లారెన్స్, ఓలీ రాబిన్సన్, సామ్ కరన్, ఓలీ రాబిన్సన్, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్, జాక్ లీచ్, ఓలీ పోప్, డేవిడ్ మలన్, క్రేగ్ ఓవర్టన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!