అభిమానులకు కప్పులు కావాలి... ర్యాంకులు కాదు: మంజ్రేకర్
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న..
బీసీసీఐ నిర్ణయానికి మంజ్రేకర్ మద్దతు
ఇంటర్నెట్ డెస్క్: విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించడంపై అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న బీసీసీఐకి మాజీ క్రికెటర్, విశ్లేషకుడు సంజయ్ మంజ్రేకర్ మద్దతు తెలిపాడు. విరాట్ను తొలగించి రోహిత్ శర్మను నియమించిన బీసీసీఐ నిర్ణయం సరైందేనని అభిప్రాయపడ్డాడు. ఐసీసీ ట్రోఫీని నెగ్గలేకపోవడమే కోహ్లీపై వేటుకు కారణమని పేర్కొన్నాడు. అభిమానులు ప్రపంచకప్లను గెలవాలని కోరుతున్నారని, అందుకే కోహ్లీని తప్పించి రోహిత్కు బాధ్యతలను బీసీసీఐ అప్పగించి ఉంటుందని విశ్లేషించాడు. వన్డే సారథ్యం నుంచి తప్పించడంపై కోహ్లీ అసంతృప్తిగా ఉండటం సరైందేనా అన్న ప్రశ్నకు మంజ్రేకర్ సమాధానం ఇస్తూ.. ‘‘ అభిమానులు ప్రపంచకప్ వంటి ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఆశిస్తున్నారు. అంతేకానీ ఇదేదో ర్యాంకులు, సిరీస్ల గురించి కాదు. అందుకే కోహ్లీ ఇబ్బంది పడుతున్నాడు’’ అని వివరించాడు. కోహ్లీ నేతృత్వంలోని టీమ్ఇండియా అన్ని ఫార్మాట్లలో అగ్రస్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే కోహ్లీ నాయకత్వంలో ఒక్కటంటే ఒక్క ఐసీసీ ట్రోఫీని భారత్ గెలుచుకోలేకపోయింది.
గత ఐపీఎల్ అనంతరం ఆర్సీబీ కెప్టెన్గా కూడానూ కోహ్లీ దిగిపోయిన విషయం తెలిసిందే. దీనిపై సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ఆర్సీబీ జట్టుకు నాయకత్వం కొనసాగించి ఉంటే బాగుండేది. కోహ్లీ టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని భావించాడు. అందుకే వన్డేలు, టెస్టుల్లో కచ్చితంగా సారథ్య బాధ్యతలను నిర్వర్తించాలని అనుకుని ఉంటాడు. అయితే బీసీసీఐ వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించింది. అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు మారిపోతుండటంతో టెస్టుల్లో నాయకత్వానికి గుడ్బై చెప్పేసి ఉండొచ్చు’’ అని విశ్లేషించాడు.
టెస్టు కెప్టెన్గా వారిద్దరిలో ఒకరు: స్టీవ్ స్మిత్
విరాట్ కోహ్లీ స్థానంలో టీమ్ఇండియా టెస్టు జట్టుకు స్టీవ్స్మిత్ ఇద్దరి పేర్లను సూచించాడు. వారిద్దరిలో ఒకరైతే సరిగ్గా సరిపోతారని పేర్కొన్నాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఎవరికైనా సరే విరాట్ స్థానంలో నాయకత్వం అప్పగించవచ్చని తెలిపాడు. ‘‘తొలుత విరాట్ కోహ్లీకి శుభాకాంక్షలు. గత ఆరేడు సంవత్సరాలుగా టీమ్ఇండియాను అద్భుతంగా నడిపించాడు. అతడి స్థానంలో కెప్టెన్సీ అప్పగించాలంటే రోహిత్, కేఎల్ రాహుల్ పేర్లను సూచిస్తా’’ అని వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడును మళ్లీ చూస్తామా?
-
కేంద్ర ఎన్నికల సంఘానికి కనకమేడల మరో లేఖ
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్