IND vs ENG: పంత్.. అతి దూకుడుగా ఆడొద్దు: మైఖేల్వాన్
ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్.. ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఐదు...
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్, భారత్ మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్లో టీమ్ఇండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్.. ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడు. ఈ సిరీస్లో ఇప్పటివరకు ఐదు ఇన్నింగ్స్ల్లో 17.40 సగటుతో 87 పరుగులు మాత్రమే చేశాడు. ముఖ్యంగా ఒలీ రాబిన్సన్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో ఇబ్బందిపడుతున్నాడు. వరుసగా విఫలమవుతున్న రిషభ్ పంత్ కోసం ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్వాన్ ఒక సలహా ఇచ్చాడు. అతడు దూకుడైన ఆటతీరును వదిలేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డాడు.
‘నేను కెప్టెన్గా ఉండి.. రవిచంద్రన్ అశ్విన్ ఎనిమిదో స్థానంలో ఆడితే.. నేను రిషభ్ పంత్ని ఏడో స్థానంలో పంపిస్తాను. అతడు( పంత్) అతి దూకుడుగా ఆడుతున్నాడు. టెక్నికల్గా ఆడటానికి ప్రయత్నిస్తున్నాడు. కట్, స్క్వేర్ డ్రైవ్, ఫుల్, స్వీప్ షాట్లు ఆడటంలో పంత్కి మంచి నైపుణ్యం ఉంది. రిషభ్ ఇప్పటికీ ప్రపంచంలోనే అత్యంత ఉత్తేజకరమైన క్రికెటర్. అతడి దగ్గర ప్రతిభ ఉంది. కానీ, ఇంగ్లాండ్లో బ్యాటింగ్ చేయడం అతనికి కష్టమవుతోంది. ఎందుకంటే.. ఇక్కడ బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అతడు ఆరో స్థానంలో వచ్చినా బంతి స్వింగ్ అవుతూనే ఉంటుంది’ అని మైఖేల్ వాన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం