IPL 2021: ధోనిభాయ్తో కలిసి ఆడటం నా అదృష్టం : పృథ్వీ షా
క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనిలో గొప్ప ఫినిషింగ్ సామర్థ్యాలున్నాయని.. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా అన్నాడు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనిలో గొప్ప ఫినిషింగ్ సామర్థ్యాలున్నాయని.. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నానని దిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు పృథ్వీ షా అన్నాడు. ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొమ్మిది సార్లు ఫైనల్కి చేరుకున్న విషయం తెలిసిందే. దిల్లీ క్యాపిటల్స్తో జరిగిన క్వాలిఫైయర్-1 మ్యాచులో సీఎస్కే కెప్టెన్ ధోని అద్భుత ఇన్నింగ్స్తో చెన్నై జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో వచ్చిన అతడు 6 బంతుల్లో 18 పరుగులు చేశాడు. దీంతో చెన్నై 4 వికెట్ల తేడాతో దిల్లీని ఓడించి నేరుగా ఫైనల్ చేరింది.
‘ధోనిభాయ్లో గొప్ప వైవిధ్యముందన్న విషయం మనందరికీ తెలిసిందే. తన అద్భుత బ్యాటింగ్తో ఎన్నో సార్లు జట్టును గెలిపించాడు. కాబట్టి, మాపై చెలరేగి ఆడటంలో ఆశ్చర్యమేమి లేదు. అతనో ప్రమాదకర ఆటగాడు. తనదైన రోజున మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగలడు. అలాంటి గొప్ప వ్యక్తితో కలిసి ఆడటం అదృష్టంగా భావిస్తున్నా’ అని పృథ్వీ షా అన్నాడు.
‘మేం గెలిచినా, ఓడిపోయినా సమష్టిగా బాధ్యత వహిస్తాం. నైపుణ్యపరంగా మా జట్టులో ఉత్తమ ఆటగాళ్లున్నారు. క్యాలిఫైయర్ మ్యాచ్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాం. అయినా, మాకు మరో అవకాశం ఉంది. ఆ మ్యాచులో గొప్పగా రాణించి.. నేరుగా ఫైనల్ చేరుతాం. ఆ నమ్మకం మాకుంది’ అని పృథ్వీ షా ఆశాభావం వ్యక్తం చేశాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్