IPL 2022 : యూఏఈ కంటే చౌకగా.. ఐపీఎల్ నిర్వహిస్తాం: సీఎస్ఏ
భారత్లోనే ఐపీఎల్ 2022 మ్యాచ్లను నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే...
ఇంటర్నెట్ డెస్క్: భారత్లోనే ఐపీఎల్ 2022 మ్యాచ్లను నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే తెలిపింది. ముంబయిలోని రెండు స్టేడియాల్లో అవసరమైతే పుణె మైదానంలో మ్యాచ్లు జరుగుతాయని పేర్కొంది. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరిస్థితులను అంచనా వేస్తున్నట్లు కూడా వెల్లడించింది. ఈ క్రమంలో క్రికెట్ సౌతాఫ్రికా (సీఎస్ఏ) కొత్త ప్రతిపాదనలను తీసుకొచ్చినట్లు సమాచారం. గత సంవత్సరం యూఏఈ వేదికగా ఐపీఎల్ జరిగిన విషయం తెలిసిందే. యూఏఈ కంటే చౌకగా తమ దేశంలో ఐపీఎల్ నిర్వహించుకోవచ్చని ప్రతిపాదించినట్లు క్రిక్బజ్ పేర్కొంది. బీసీసీఐ, సీఎస్ఏ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలిపింది.
మైదానాల వద్దకు వెళ్లేందుకు తక్కువ ప్రయాణ ఛార్జీలు, యూఏఈతో పోలిస్తే హోటల్ టారిఫ్లు అందుబాటులో ఉండేలా చూస్తామని సీఎస్ఏ హామీనిచ్చినట్లు సమాచారం. దీని వల్ల ఫ్రాంచైజీల ఖర్చులు భారీగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. సీఎస్ఏ బ్లూప్రింట్ ప్రకారం.. దక్షిణాఫ్రికాలోని నాలుగు స్టేడియాల్లోనే మొత్తం మ్యాచ్లను నిర్వహించుకునేందుకు అవకాశం ఉంది. జోహెన్నెస్బర్గ్, ప్రిటోరియా, బెనోని, పోట్చెఫ్స్ట్రోమ్ ప్రాంతాల్లో మ్యాచ్లను ఆడించవచ్చు. అన్ని మైదానాలు అంతర్జాతీయ స్థాయిలో ఉంటాయని, ప్రయాణ దూరం కూడా ఎక్కువగా ఉండదు. అయితే బీసీసీఐ, సీఎస్ఏ నుంచి దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. దక్షిణాఫ్రికా వేదికగానే 2009 ఐపీఎల్ సీజన్ మ్యాచ్లు జరిగిన విషయం తెలిసిందే.
ఐపీఎల్ 2022 మ్యాచ్ల వేదికలను ఫిబ్రవరి 20న బీసీసీఐ ఖరారు చేయనుంది. భారత్లోనే మ్యాచ్లను నిర్వహించాలని ఫ్రాంచైజీ యాజమాన్యాలు బీసీసీఐని కోరుతున్నాయి. అయితే బీసీసీఐ సభ్యుల్లో కొందరు ఐపీఎల్ను దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఈసారి ఐపీఎల్లో 10 జట్లు పాల్గొననున్నాయి. మొత్తం 74 మ్యాచ్లు జరుగుతాయి. ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?