Beijing Olympics: ప్రేక్షకులు లేకుండానే బీజింగ్ ఒలింపిక్స్!
వచ్చే నెలలోనే చైనా రాజధాని బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగబోతున్నాయి. కరోనా మహమ్మారి ఎంత విజృంభించినా తగిన చర్యలు తీసుకుంటూ విజయవంతంగా ఒలింపిక్స్ను నిర్వహిస్తామని చెబుతోన్న చైనా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో
బీజింగ్: వచ్చే నెలలోనే చైనా రాజధాని బీజింగ్ వేదికగా శీతాకాల ఒలింపిక్స్ జరగబోతున్నాయి. కరోనా మహమ్మారి ఎంత విజృంభించినా తగిన చర్యలు తీసుకుంటూ విజయవంతంగా ఒలింపిక్స్ను నిర్వహిస్తామని చెబుతోన్న చైనా తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రేక్షకులకు ఒలింపిక్స్ టికెట్లు విక్రయించట్లేదని ప్రకటించింది.
గతంలోనే అంతర్జాతీయ ప్రేక్షకులకు అనుమతి నిరాకరించిన చైనా.. దేశీయంగా ప్రేక్షకులకు టికెట్లు విక్రయిస్తామని ప్రకటించింది. కానీ, ఇప్పుడు ప్రేక్షకులు లేకుండానే క్రీడా పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. అథ్లెట్లు, వారితోపాటు వచ్చే ఇతర సిబ్బంది ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకొనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒలింపిక్స్ నిర్వాహకులు చెబుతున్నారు. అయితే, ఒలింపిక్స్ వేదికలను ఏర్పాటు చేసిన సిబ్బందే ప్రేక్షకులుగా గ్యాలరీలో కూర్చొని క్రీడల్ని వీక్షించే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. అమెరికా, యూకే, కెనడా సహా పలు దేశాలు దౌత్యపరంగా బీజింగ్ ఒలింపిక్స్ను నిషేధించిన విషయం తెలిసిందే. అయితే, అథ్లెట్లను పంపించేందుకు ఆయా దేశాలు ఒప్పుకున్నాయి. ఇప్పటికే పలు దేశాల నుంచి క్రీడాకారులు ఒలింపిక్స్లో పాల్గొనేందుకు బీజింగ్కు బయలుదేరారు. చైనాలో అడుగుపెట్టిన వెంటనే వారిని బయోబబుల్లోకి పంపి.. కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని అధికారులు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల క్రమంగా పెరుగుతుండటం, అంతర్జాతీయ విమాన సేవలపై ఆంక్షలు మొదలవడంతో అసలు ఒలింపిక్స్ క్రీడలు జరుగుతాయా లేదా? అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా