IPL 2021: హైదరాబాద్పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం..
ఐపీఎల్ రెండో అంచెలో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. షార్జా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ రెండో అంచెలో చెన్నై సూపర్ కింగ్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. షార్జా వేదికగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో చెన్నై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హైదరాబాద్ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 19.4 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (45: 38 బంతుల్లో 4x4, 2x6), డుప్లెసిస్ (41: 36 బంతుల్లో 3x4, 2x6) ఆరంభం నుంచే ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. వీరి ధాటికి మ్యాచ్ రెండు మూడు ఓవర్ల ముందుగానే ముగుస్తుందనిపించింది. అయితే జట్టు స్కోరు 100 పరుగులు దాటిన తర్వాత స్వల్ప తేడాతో మొయిన్ అలీ (17), సురేశ్ రైనా (2), డుప్లెసిస్ వరుసగా పెవిలియన్ చేరారు. దీంతో చెన్నై పరుగుల వేగం మందగించింది. ఈ క్రమంలోనే లక్ష్యం రెండు ఓవర్లలో 16 పరుగులుగా మారింది. అయితే, భువనేశ్వర్ కుమార్ వేసిన 18 ఓవర్లో రాయుడు ఓ సిక్స్, ధోనీ ఫోర్ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. ఇక చివరి ఓవర్లో మూడు పరుగులు అవసరం కాగా, మొదటి మూడు బంతులకు సిద్ధార్ధ్ కౌల్ కేవలం ఒకే పరుగు ఇచ్చాడు. దీంతో క్రీజులో రాయుడు, ధోనీ ఉన్నప్పటికీ కొంత ఉత్కంఠ నెలకొంది. అయితే తర్వాతి బంతిని కెప్టెన్ ధోనీ భారీ సిక్సర్గా మలిచి చెన్నై జట్టుకు విజయాన్నందించాడు. ఈ విజయంతో చెన్నై అధికారికంగా ప్లే ఆఫ్స్కి చేరినట్లయింది. హైదరాబాద్ బౌలర్లలో జేసన్ హోల్డర్ మూడు, రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశారు.
అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్కి దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది. ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (44) టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆరంభంలోనే ఓపెనర్ జేసన్ రాయ్ (2) ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు. ప్రియం గార్గ్ (7) కూడా త్వరగానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అభిషేక్ శర్మ (18), అబ్దుల్ సమద్ (18) నిలకడగా ఆడుతూ క్రీజులో కుదురుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే హేజిల్ వుడ్ వేసిన 17వ ఓవర్లో ఇద్దరూ ఔటవడంతో హైదరాబాద్ జట్టుకి షాక్ తగిలింది. జేసన్ హోల్డర్ (5) నిరాశ పరిచాడు. చివర్లో బ్యాటింగ్ వచ్చిన రషీద్ ఖాన్ (17), భువనేశ్వర్ (2) పరుగులతో నాటౌట్గా నిలిచారు. చెన్నై బౌలర్లలో హేజిల్ వుడ్ 3, బ్రావో 2, శార్ధూల్ ఠాకూర్, జడేజా తలో వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు.