సవాళ్లకు పంచ్
జీవనం సాగించేందుకు నిత్యం పోరాటం చేసే కుటుంబం అతనిది. శరీరానికి శక్తిని అందించే సమతుల ఆహారానికి అతనెంతో దూరం...
బాక్సింగ్లో మెరుస్తున్న దీపక్ కుమార్
జీవనం సాగించేందుకు నిత్యం పోరాటం చేసే కుటుంబం అతనిది. శరీరానికి శక్తిని అందించే సమతుల ఆహారానికి అతనెంతో దూరం.. ఇలాంటి పరిస్థితుల్లో ఆ కుర్రాడు బాక్సింగ్ను వదిలిపెట్టి తన కుటుంబానికి సాయంగా ఉండాలనుకున్నాడు. తనకెంతో ఇష్టమైన ఆటకు దూరంగా బతుకు ప్రయాణం సాగిద్దామనుకున్నాడు. ఒకవేళ అదే జరిగి ఉంటే.. మనం ఇప్పుడు ఇలా అతని గురించి చెప్పుకునేవాళ్లం కాదు. కోచ్ సహకారంతో బాక్సింగ్లోనే కొనసాగి.. ఉత్తమ బాక్సర్గా ఎదిగే దిశగా అతనిప్పుడు సాగుతున్నాడు. తాజాగా బల్గేరియాలో జరిగిన స్ట్రాంజా స్మారక బాక్సింగ్ టోర్నీలో ప్రపంచ ఛాంపియన్, 2016 రియో ఒలింపిక్స్ స్వర్ణ విజేత జోరోవ్ (ఉజ్బెకిస్థాన్)ను చిత్తు చేసి సంచలన విజయం సాధించాడు. అతనే.. 23 ఏళ్ల దీపక్ కుమార్ భోరియా. జీవితంలోని సవాళ్లకు పంచ్ విసురుతూ సాగుతున్నాడీ హరియాణా బాక్సర్.
ఈనాడు క్రీడావిభాగం
పేద కుటుంబం.. కెరీర్ ఆరంభంలోనే గాయం.. తొలి సీనియర్ జాతీయ ఛాంపియన్షిప్ మొదటి బౌట్లోనే నాకౌట్ ఓటమి.. ఇలా ఎన్నో అడ్డంకులు తనను వెనక్కి లాగాలని ప్రయత్నించినా దీపక్ పట్టు వదల్లేదు. రింగ్ దాటి బయటకు రాలేదు. సవాళ్లు ఎదురైనా ప్రతి సారి అత్యుత్తమ రీతిలో స్పందించాడు. కష్టాలను దాటి కలల దారిలో ప్రయాణం కొనసాగిస్తున్నాడు. పదకొండేళ్ల వయసులోనే అతనికి బాక్సింగ్పై ప్రేమ కలిగింది. చేతులకు గ్లోవ్స్ వేసుకుని.. ప్రత్యర్థిపై పిడిగుద్దులు కురిపించాలనే కోరిక ఏర్పడింది. కానీ తన ఆర్థిక పరిస్థితి అడ్డుగా మారింది. అయినప్పటికీ కోచ్ షెరోన్ కారణంగా అప్పుడప్పుడూ బాక్సింగ్లో సాధన చేసే వీలు కలిగింది. కానీ 15 ఏళ్లు వచ్చేసరికి.. సరైన పోషకాహారం లేకపోవడంతో ప్రాక్టీస్ చేయడం కష్టమైంది. నొప్పులతో శరీరం బాక్సింగ్ శిక్షణకు సహకరించలేదు. దీంతో ఆటను వదిలేసి కుటుంబానికి అండగా నిలుద్దామనుకున్నాడు. కానీ అతనిలోని బాక్సింగ్ ప్రతిభను గుర్తించిన షెరోన్.. తనను వదల్లేదు. స్నేహితుల సాయంతో డబ్బు సమకూర్చి మంచి ఆహారం అందేలా చూశాడు. రుణం తీసుకుని మరీ తన శిక్షణ కొనసాగేలా చూశాడు. కోచ్ నమ్మకాన్ని వమ్ము చేయని దీపక్ అంచెలంచెలుగా ఎదిగాడు.
సహజంగానే..: మొదట్లో బాక్సింగ్ అంటే ఏమిటో కూడా తెలియని దీపక్ ప్రస్తుతం ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే.. అందుకు అతని తపన, పట్టుదల, సహజ సిద్ధంగా అబ్బిన ప్రతిభ ముఖ్య కారణాలు. రింగ్లో వేగంగా కదలడం, ప్రత్యర్థిని దెబ్బకొట్టడం, తొందరగా స్పందించడం లాంటి నైపుణ్యాలు తనకు సహజంగానే వచ్చాయి. అందుకే చిన్నప్పటి నుంచే ప్రత్యేకంగా నిలిచాడు. ఒక్కో మెట్టు ఎక్కుతూ సాగుతున్న అతని ప్రయాణంలో.. 2011లో తన కెరీర్నే ప్రమాదంలో పెట్టే గాయం ఎదురైంది. పట్టుదలతో దాని నుంచి బయటపడ్డ అతనికి.. తన తొలి సీనియర్ జాతీయ బాక్సింగ్ (2017లో విశాఖపట్నంలో) ఛాంపియన్షిప్ తొలిరౌండ్లోనే నాకౌట్ ఓటమి పలకరించింది. అయినా అతను కుంగిపోలేదు. మరింత శ్రమించి ఆటను మెరుగుపర్చుకున్నాడు. మానసికంగా బలంగా సిద్ధమయ్యాడు. అదే ఏడాది అగ్రశ్రేణి బాక్సర్ అమిత్ పంగాల్పై విజయం తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే జోరుతో 2018లో జాతీయ ఛాంపియన్గా నిలిచాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ నిలకడ ప్రదర్శిస్తున్నాడు. ఆసియా ఛాంపియన్షిప్లో రజతం, థాయ్లాండ్ ఓపెన్, మక్రాన్ కప్, ప్రపంచ మిలిటరీ క్రీడల్లో పతకాలు సాధించాడు. ప్రస్తుతం భారత సైన్యంలో సుబేదార్గా ఉన్న అతను తాజాగా స్ట్రాంజా బాక్సింగ్ టోర్నీ పురుషుల 52 కేజీల విభాగం సెమీస్లో ఇప్పటివరకూ తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శనతో జోరోవ్పై అద్భుత విజయం సాధించాడు. ఆ తర్వాత హోరాహోరీ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నప్పటికీ టోర్నీలో అతను చూపించిన తెగువ అందరి మన్ననలు అందుకుంది. ఇదే జోరుతో ఒలింపిక్స్లో భారత్కు పతకం అందించాలనే లక్ష్యం వైపు దీపక్ సాగుతున్నాడు.
గడిచిన కొన్ని రోజుల్లో కల నిజమైనట్లుగా అనిపించింది. ప్రపంచంలోని కఠినమైన బాక్సింగ్ టోర్నీల్లో ఒకటైన స్ట్రాంజా స్మారక పోటీల్లో ఒలింపిక్, ప్రపంచ ఛాంపియన్ జోరోవ్ను ఓడించడం.. ఆ తర్వాత రజతం సొంతం చేసుకోవడం చాలా ప్రత్యేకంగా అనిపిస్తోంది. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. కానీ బాక్సింగ్ నాకు అన్నీ ఇచ్చింది. ఇకపై స్వర్ణాలు గెలవడంపైనే నా దృష్టి. శ్రమ, అంకితభావంతో ఏదైనా సాధ్యమే అనే ఆత్మవిశ్వాసం నాకుంది. - దీపక్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?