2127 మ్యాచ్ల నిర్వహణకు బీసీసీఐ సిద్ధం
కరోనా వైరస్ కారణంగా గతేడాది సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. 2021-22 సీజన్కు సంబంధించి అన్ని స్థాయిల టోర్నమెంట్లు, మ్యాచ్లు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది...
నవంబర్ 16 నుంచి రంజీ ట్రోఫీ
దిల్లీ: కరోనా వైరస్ కారణంగా గతేడాది సరిగ్గా నిర్వహించలేకపోయిన దేశవాళీ క్రికెట్ను బీసీసీఐ ఈసారి పూర్తిస్థాయిలో జరపడానికి సిద్ధమైంది. 2021-22 సీజన్కు సంబంధించి అన్ని స్థాయిల టోర్నమెంట్లు, మ్యాచ్లు నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించింది. అందులో భాగంగా మొత్తం 2,127 మ్యాచ్ల నిర్వహణకు పచ్చజెండా ఊపింది. నవంబర్ 16 నుంచి రంజీ ట్రోఫీ మొదలవ్వనున్నట్లు తెలిసింది. ఈ మేరకు బీసీసీఐ సెక్రటరీ జైషా శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. గతేడాది కరోనా నేపథ్యంలో రంజీ ట్రోఫీతో పాటు మిగతా టోర్నీలేవీ జరగని సంగతి తెలిసిందే.
అప్పుడు కేవలం సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీలు మాత్రమే నిర్వహించింది. ఈ ఏడాది అలా కాకుండా అన్ని టోర్నీలను మునుపటిలా నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ‘ఈ 2021-22 సీజన్ సెప్టెంబర్ 21 నుంచి సీనియర్ మహిళల వన్డే లీగ్తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 27 నుంచి సీనియర్ మహిళల వన్డే ఛాలెంజర్ ట్రోఫీ ఉంటుంది. ఈ క్రమంలోనే అక్టోబర్ 20 నుంచి నవంబర్ 12 వరకు సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ, నవంబర్ 16 నుంచి 2022 ఫిబ్రవరి 19 వరకు రంజీ ట్రోఫీలు జరగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 26 వరకు విజయ్ హజారే ట్రోఫీ నిర్వహించనున్నారు. బీసీసీఐ ఈ సీజన్ను విజయవంతంగా నిర్వహిస్తుందనే పూర్తి నమ్మకం ఉంది. అలాగే ఇందులో భాగమైన ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రత మాకెంతో ముఖ్యం’ అని ఆ లేఖలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.