రంజీకి బదులు విజయ్‌ హజారె ట్రోఫీ 

కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా 2020-21 సీజన్‌లో రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం...

Published : 30 Jan 2021 11:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా 2020-21 సీజన్‌లో రంజీ ట్రోఫీకి బదులు 50 ఓవర్ల విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ మేరకు సెక్రటరీ జై షా శుక్రవారం అన్ని రాష్ట్ర క్రికెట్‌ సంఘాలకు లేఖ రాశారు. ఈ కరోనా మహమ్మారి అందరినీ పరీక్షించిందని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లో రాష్ట్ర సంఘాల మద్దతుతోనే పురుషుల దేశవాళి, అంతర్జాతీయ క్రికెట్‌ను తిరిగి ప్రారంభించామని షా పేర్కొన్నారు. అయితే, 2020-21 సీజన్‌లో విలువైన సమయాన్ని కోల్పోయామన్నారు. దాంతో ఈ ఏడాది క్రికెట్‌ మ్యాచ్‌ల ప్రణాళికలు రూపొందించడానికి కష్టతరమైందని వివరించారు.

అలాగే మహిళల క్రికెట్‌ మ్యాచ్‌లు నిర్వహించడం కూడా ముఖ్యమని బీసీసీఐ సెక్రటరీ గుర్తుచేశారు. ‘ఈ విషయాన్ని తెలియజేసేందుకు సంతోషిస్తున్నా. సీనియర్‌ మహిళల వన్డే క్రికెట్‌తో పాటు విజయ్‌ హజారె, అండర్‌-19 క్రికెటర్లకు వినో మన్కడ్‌ ట్రోఫీలు నిర్వహించాలని అనుకుంటున్నాం. ఈ సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌ నిర్వహణపై మీ నుంచి వచ్చిన వినతుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని షా పేర్కొన్నారు. కాగా, మార్చి నెలాఖరున ఐపీఎల్‌ 14వ సీజన్‌ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఫిబ్రవరిలోనే విజయ్‌ హజారె ట్రోఫీ నిర్వహించే అవకాశం ఉంది. అందుకు సంబంధించి త్వరలోనే వేదికలను ప్రకటిస్తారు. ఈ ట్రోఫీ కోసం ఆరు బయో బుడగలను ఏర్పాటు చేస్తుండగా ఆటగాళ్లంతా వచ్చే వారమే అందులోకి అడుగుపెడతారని తెలుస్తోంది. 

ఇవీ చదవండి..
‘గాయ’పడ్డ కెరీర్లు.. జాగ్రత్త క్రికెటర్లూ!
కోహ్లీని ఔట్ చేసే వ్యూహమదే: ఇంగ్లాండ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని