Nathan Lyon: వారిని వారి గడ్డపైనే ఓడించాలి.. ఆ జట్టులో నేనుండాలి: నాథన్ లియోన్
ఎన్ని వన్డేలు, టీ20 మ్యాచ్లు ఆడినా.. కెరీర్లో ఒక్కసారైనా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఆటగాడి కల..
ఇంటర్నెట్ డెస్క్: ఎన్ని వన్డేలు, టీ20 మ్యాచ్లు ఆడినా.. కెరీర్లో ఒక్కసారైనా టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతి ఆటగాడి కల. ఇక భారత్-పాకిస్థాన్, భారత్-ఆస్ట్రేలియా, భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా సరే ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంటుంది. గత కొన్నేళ్లుగా అడపాదడపా ఐసీసీ టోర్నీల్లో తలపడటం మినహా టీమ్ఇండియా, పాక్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్లు లేనేలేవు. మరో వైపు ఆసీస్, ఇంగ్లాండ్ను వారి గడ్డపైనే ఓడించి మరీ భారత్ తన సత్తా ఏంటో ప్రపంచానికి చాటింది. ఇక మన మైదానాల్లో అయితే టీమ్ఇండియాకు తిరుగే ఉండదు. ఈ క్రమంలో మన దేశంలోనే భారత్ను ఆస్ట్రేలియా ఓడించాలని.. ఆ జట్టులో తాను ఉండాలని కోరుకుంటున్నాడు ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియోన్. షెడ్యూల్ ప్రకారం అయితే గత అక్టోబర్లోనే ఆసీస్ పర్యటన ఉండాల్సింది. అయితే ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ ఉండటంతో పర్యటనను బీసీసీఐ వాయిదా వేసింది.
భవిష్యత్తులో తన లక్ష్యం గురించి నాథన్ లియోన్ మాట్లాడుతూ.. ‘‘ భారత్పై వారి గడ్డమీదే ఆసీస్ గెలవాలి. ఆ జట్టులో నేను సభ్యుడిని కావాలి. ఇదే నాకున్న అతిపెద్ద లక్ష్యాల్లో ఒకటి. టెస్టు సిరీస్లో నేను కీలక పాత్ర పోషిస్తాననే నమ్మకం ఉంది’’ అని స్పష్టం చేశాడు. ఆసీస్ తరఫున వంద టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించిన నాథన్ 399 వికెట్లను పడగొట్టాడు. 400 వికెట్ల మైలురాయికి కేవలం ఒకే ఒక్క వికెట్ దూరంలో ఉన్నాడు. గతేడాది టీమ్ఇండియా ఆసీస్ పర్యటనకు వెళ్లింది. నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ను భారత్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఆ సిరీస్లో లియోన్ మొత్తం 9 వికెట్లను మాత్రమే తీయగలిగాడు. వచ్చే డిసెంబర్ 8 నుంచి ఇంగ్లాండ్-ఆసీస్ మధ్య యాషెస్ సిరీస్ (ఐదు టెస్టులు) ప్రారంభం కానుంది. దీని కోసం ఇప్పటి నుంచే లియోన్ సన్నద్ధమవుతున్నాడు. మరోవైపు తొలిసారి టీ20 ప్రపంచకప్ను అందుకోవాలని ఆసీస్ ఆదివారం (నవంబర్ 14) కివీస్తో తలపడనుంది.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/04/24)