Australia Tour of Pakistan: పాక్లో పర్యటించనున్న ఆస్ట్రేలియా.. 24 ఏళ్ల తర్వాత!
సుదీర్ఘ కాలం అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో పాక్తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది......
ఇంటర్నెట్ డెస్క్: సుదీర్ఘ కాలం అనంతరం ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించనుంది. వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్లో పాక్తో మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడనుంది. దీంతో 24 ఏళ్ల విరామానికి తెరపడనుంది. చివరిసారి 1998లో ఆసీస్ జట్టు పాకిస్థాన్లో పర్యటించింది. అయితే ఆ తర్వాత వివిధ కారణాల వల్ల పలుమార్లు పాక్ పర్యటను ఆస్ట్రేలియా రద్దు చేసుకుంది. 2002 పాక్లో పర్యటించాల్సిన ఉండగా.. కరాచీలో ఆత్మాహుతి బాంబు దాడి జరగడంతో ఆ పర్యటను రద్దు చేసుకుంది. 2008లో పాకిస్థాన్లో సాధారణ ఎన్నికలకు ముందు జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఆసీస్ తన పర్యటనను మరోసారి రద్దు చేసుకుంది.
‘ఆసీస్తో టెస్టు, వన్డే సిరీస్లు జరగనుండటం అంతులేని ఆనందాన్నిస్తోంది. అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న ఆస్ట్రేలియా.. 24 ఏళ్ల తర్వాత మా గడ్డపై ఆడటం అభిమానులకు పండగే’ అని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ రమీజ్ రాజా వెల్లడించారు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు మాత్రం పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ‘ఆస్ట్రేలియా వచ్చే ఏడాది పాకిస్థాన్లో పర్యటించే అవకాశం ఉంది. అందుకోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం’ అని ఆసీస్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిక్ హాక్లే వెల్లడించారు. అయితే ఈ టూర్ అయినా విజయవంతంగా కొనసాగాలని పాక్ అభిమానులు కోరుకుంటున్నారు.
గత సెప్టెంబర్లో పాక్ పర్యటనకు వెళ్లిన న్యూజిలాండ్ జట్టు.. భద్రతా కారణాల దృష్ట్యా ఆ సిరీస్ను అకస్మాతుగా రద్దు చేసుకుంది. ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే స్వదేశానికి వెళ్లిపోయింది. 18 ఏళ్ల విరామం తర్వాత పాకిస్థాన్కు వచ్చిన కివీస్.. తొలి వన్డే ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు తన నిర్ణయాన్ని ప్రకటించి హుటాహుటిన తిరిగి వెళ్లిపోయింది. ఇంగ్లాండ్ సైతం ఈ తరహా నిర్ణయమే తీసుకుంది. గత అక్టోబరులో ఇంగ్లాండ్ పురుషులు, మహిళల క్రికెట్ జట్లు పాకిస్థాన్లో పర్యటించాల్సి ఉండగా.. పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బంది శ్రేయస్సు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని ఈసీబీ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!