T20 World Cup: టీ20 ప్రపంచకప్ విజేత ఆస్ట్రేలియా
టీ20 ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా దుమ్మురేపింది. తొలిసారి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడింది. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇంటర్నెట్డెస్క్: క్రికెట్లో ఘన చరిత్ర కలిగిన జట్టు.. వన్డేల్లో తిరుగులేని రికార్డు.. ఐదు ప్రపంచకప్ టైటిల్స్ను గెలుచుకుంది.. ఒకప్పుడు ఆ జట్టంటే ప్రత్యర్థికి హడల్.. క్రికెట్లో రారాజుగా వెలుగొందిన ఆ జట్టుకు టీ20లు పెద్దగా అచ్చిరాలేదేమో.. చిన్నజట్ల చేతిలోనూ సిరీస్లను కోల్పోయింది. కీర్తిప్రతిష్ఠలు క్రమంగా మసకబారుతున్న వేళ అద్భుతం సృష్టించింది. ఫేవరేట్లను కాదని సమష్ఠిగా రాణించి తొలిసారి పొట్టి ప్రపంచకప్ను ముద్దాడింది.. దాదాపు పద్నాలుగేళ్ల తమ నిరీక్షణకు తెరదించుకుంది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు.
న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ పోరులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. కివీస్ సారథి కేన్ విలియమ్సన్ (48 బంతుల్లో 85: పది ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్ (50 బంతుల్లో 77 నాటౌట్: ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53: నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు) వీరవిహారం చేశారు. ట్రెంట్ బౌల్ట్ (2/18) మినహా మిగతా బౌలర్లు విఫలమయ్యారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా ఆసీస్ బ్యాటర్ మిచెల్ మార్ష్, ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్గా డేవిడ్ వార్నర్ ఎంపికయ్యారు.
కీలకమైన టాస్..
మరోసారి ఈ మ్యాచ్లో టాస్ కీలకంగా మారింది. టాస్ నెగ్గిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని కివీస్ను బ్యాటింగ్కు ఆహ్వానించింది. అయితే మొదటి పది ఓవర్లపాటు ఆచితూచి ఆడిన న్యూజిలాండ్.. ఆఖర్లో మాత్రం దుమ్మురేపింది. దీనికి కారణం ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్ మొదట్లో నిదానంగా ఆడాడు. ఒక్కసారిగా గేర్లు మార్చి ఆసీస్ బౌలర్లను తుత్తునీయలు చేశాడు. చివరి పది ఓవర్లలో 115 పరుగులు వచ్చాయంటే కేన్ బ్యాటింగ్ మహిమే. అయితే తొలి శతకం నమోదు చేసుకుంటాడనుకుంటే భారీ షాట్కు యత్నించి పెవిలియన్కు చేరాడు. మిగతా బ్యాటర్లలో గప్తిల్ 28, మిచెల్ 11, ఫిలిప్స్ 18, నీషమ్ 13 నాటౌట్, సీఫర్ట్ 8 నాటౌట్ పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో హేజిల్వుడ్ 3, జంపా ఒక వికెట్ పడగొట్టారు. స్టార్క్ (4-0-60-0) తేలిపోయాడు.
కసిగా బ్యాటింగ్ చేసిన ఆసీస్
173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్కు శుభారంభం దక్కలేదు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ (5) త్వరగానే పెవిలియన్కు చేరాడు. అయితే ఆ ఆనందం కివీస్కు ఎక్కువ సేపు నిలవలేదు. డేవిడ్ వార్నర్తో కలిసి మిచెల్ మార్ష్ స్వైరవిహారం చేశారు. జట్టుకు కప్ అందించాలనే కసితో ఉన్న వీరిద్దరూ కివీస్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. ఈ క్రమంలో అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. విజయం ఖాయమైన సమయానికి వార్నర్ పెవిలియన్కు చేరాడు. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన మ్యాక్స్వెల్ (28*)తో కలిసి మరో వికెట్ పడనీయకుండా మార్ష్ జట్టును విజయతీరాలను చేర్చాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు.
ఆసీస్ గెలుచుకున్న ఐసీసీ టోర్నీలు
* వన్డే ప్రపంచకప్లు (5): 1987, 1999, 2003, 2007, 2015
* ఛాంపియన్స్ ట్రోఫీ (2): 2006, 2009
* టీ20 ప్రపంచకప్ : 2021
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు