Virat-Anushka: విరాట్..నాకు ఆ రోజు ఇంకా గుర్తుంది: అనుష్క శర్మ

 టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ...

Published : 17 Jan 2022 01:35 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టెస్టు కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన నేపథ్యంలో విరాట్ కోహ్లీకి అనుష్క శర్మ సోషల్‌ మీడియా వేదికగా ఓ భావోద్వేగ సందేశం పోస్టు చేసింది. ‘‘2014లో ఎంఎస్‌ ధోనీ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ కాబోతున్నాడని .. తదుపరి భారత కెప్టెన్‌గా ఎంపిక అవుతున్నట్లు చెప్పిన రోజు నాకింకా గుర్తుంది. ఆ తర్వాత ఓ రోజు ఎంఎస్‌డీ, నువ్వు, నేనూ మాట్లాడుకుంటూ ‘నీ గడ్డం ఎంత త్వరగా నెరిసిపోతుందో చూడు’ అని ధోనీ వేసిన జోక్‌ను బాగా ఎంజాయ్‌ చేశాం కదా. ఆ రోజు నుంచి నీ గడ్డం నెరవడం చూడటమే కాకుండా నీలో ఎంతో వృద్ధిని చూశా. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నీ ఎదుగుదలతో పాటు సాధించిన విజయాలకు ఎంతో గర్వపడుతున్నా. ఈ ఏడేళ్లలో నేర్చుకున్న విషయాలను తండ్రిలో మన పాపాయి తప్పకుండా చూస్తుంది’’ అని పోస్ట్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క శర్మ చేసిన పోస్ట్‌ మీ కోసం..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని