IND Vs ENG: భారత్‌ x ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఐదో టెస్టు రద్దు?

భారత్‌ - ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయినట్లు ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది.

Updated : 10 Sep 2021 14:27 IST

లండన్‌: భారత్‌ - ఇంగ్లాండ్‌ మధ్య ప్రారంభంకావాల్సిన ఐదో టెస్టు చివరి నిమిషంలో రద్దయినట్లు ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత జట్టు శిక్షణ బృంద సభ్యులకు కరోనా సోకడంతో ముందుజాగ్రత్త చర్యగా ఐదో టెస్టును రద్దు చేస్తున్నట్లు తెలిసింది.

కొవిడ్‌ నేపథ్యంలో ఐదో టెస్టులో భారత్‌ తుదిజట్టుని దింపలేకపోతోందని... ఈసీబీ తొలుత పేర్కొంది. దాంతో ఈ మ్యాచ్‌ను భారత్‌ కోల్పోయినట్లు రాసుకొచ్చింది. కాసేపటి తర్వాత ఏమైందో తెలియదు కానీ, ఈసీబీ తన ప్రకటనలో మార్పులు చేసింది. చివరికి ఈ మ్యాచ్‌ రద్దయినట్లుగా మాత్రమే పేర్కొంది. మరోవైపు ఈ విషయంపై స్పందించిన బీసీసీఐ వర్గాలు ప్రస్తుతం ఈ మ్యాచ్‌ జరగకపోయినా తర్వాత నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. అయితే మ్యాచ్‌ పరిస్థితిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ముందంజలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సిరీస్‌ ఫలితంపై సందిగ్ధత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు