Paralympics: 18 ఏళ్లకే పతకం.. హైజంప్లో అదరగొట్టిన ప్రవీణ్
పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్లో
టోక్యో: పారాలింపిక్స్లో భారత్ ఖాతాలో మరో పతకం వచ్చి చేరింది. పురుషుల హైజంప్లో ప్రవీణ్కుమార్ రజత పతకం సాధించాడు. దీంతో భారత్ సాధించిన పతకాల సంఖ్య 11కు చేరింది. మరోవైపు రజతం సాధించిన ప్రవీణ్కుమార్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ప్రవీణ్ కృషి, పట్టుదలకు నిదర్శనమే ఈ పతకమని చెప్పారు. ఈ మేరకు మోదీ ట్వీట్ చేశారు.
శుక్రవారం జరిగిన టి64 హైజంప్లో ప్రవీణ్ కుమార్ అద్భుతం చేశాడు. పారాలింపిక్స్ అరంగేట్రంలోనే పతకం సాధించాడు. 2.07 మీటర్లు గెంతి సరికొత్త ఆసియా రికార్డు సృష్టించాడు. స్వర్ణం అందుకున్న జొనాథన్ బ్రూమ్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్లు గెంతడం గమనార్హం. కాగా భారత బృందంలో అత్యంత పిన్న వయసులోనే పతకం అందుకున్నది కుమారే (18 ఏళ్లు) కావడం ప్రత్యేకం.
ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ ప్రదర్శన ఇదే. నోయిడాకు చెందిన అతడు 2019లో ఈ క్రీడలో అడుగుపెట్టాడు. అదే ఏడాది జూనియర్ పారా ప్రపంచ ఛాంపియన్షిప్లో రజతం ముద్దాడాడు. కొన్నేళ్లుగా అతడు జాతీయ కోచ్ సత్యపాల్ సింగ్ నేతృత్వంలో శిక్షణ తీసుకుంటున్నాడు. బాల్యం నుంచి అతడు సాధారణ అథ్లెట్లతోనే పోటీపడటం గమనార్హం.
మోదీ ప్రశంసలు
అద్భుత ప్రదర్శన చేసిన ప్రవీణ్ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అతడి అంకితభావం, పట్టుదలకు ఈ పతకం నిదర్శనమని పొగిడారు. ‘పారాలింపిక్స్లో రజతం గెలిచిన ప్రవీణ్ను చూసి గర్విస్తున్నాను. అతడి అకుంఠిత దీక్ష, అంకితభావం, శ్రమకు ఈ పతకమే నిదర్శనం. అతడికి అభినందనలు. మున్ముందు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
మార్చిలోనే వడగాలులు!
-
కంప్యూటర్ ఎక్కడ? ఇంకా బిల్లులెన్ని ఉన్నాయి?.. ఆసుపత్రి పడకపై ట్రెజరీ ఉద్యోగి కలవరింతలు
-
నగదుంటేనే రైడ్ రైట్
-
సంధ్య ఆక్వా ఎండీ సోదరుడి ఇంటికి మంత్రి మేరుగు నాగార్జున.. ముచ్చట్లలో మర్మమేమి?
-
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
-
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన