ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌ రేసులో ఆ దిగ్గజ సంస్థ

2020 ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో తప్పుకున్నాక స్పాన్సర్‌షిప్‌ కోసం పలు సంస్థలు..

Published : 17 Aug 2020 19:06 IST

ఇంటర్నెట్ డెస్క్‌: 2020 ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి వివో తప్పుకున్నాక స్పాన్సర్‌షిప్‌ కోసం పలు సంస్థలు రేసులో నిలిచాయి. పతంజలి ఆయుర్వేద, బైజూస్‌, డ్రీమ్‌ 11 ఫాంటసీ స్పోర్ట్స్‌ లాంటి సంస్థలు స్పాన్సర్‌షిప్‌ కోసం ముందుకు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం భారత దిగ్గజ సంస్థ టాటా సన్స్‌ సంస్థ రేసులో నిలిచింది. వేలంపాటలో అత్యధికంగా కోట్‌ చేసిన సంస్థకి, టోర్నమెంట్‌పై ఆ బ్రాండ్‌ చూపే ప్రభావాన్ని బట్టే ఆ సంస్థకు ఐపీఎల్‌ స్పాన్సర్‌షిప్‌ దక్కనుంది. ఈ రకంగా చూస్తే స్పాన్సర్‌షిప్‌ రేసులో టాటా సన్స్‌ ముందుండనుంది.

‘టాటా సన్స్‌ సంస్థ భిన్నమైన రంగాల్లో రాణిస్తూ వినియోగదారులకు అత్యుత్తమ సేవలందిస్తోంది. రేసులో ఉన్న అన్ని సంస్థలు రూ.200 కోట్ల స్పాన్సర్‌షిప్‌ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈ సంస్థల్లోకెల్లా ఉత్తమం టాటా సన్స్‌. వివాద రహిత బ్రాండ్‌. ఎన్నో ఏళ్లుగా దేశంలో ఉత్తమ సేవలందిస్తోంది’ అని హరీష్‌ బిజూర్‌ కన్సల్టెన్సీ సంస్థ బ్రాండ్‌ స్ట్రాటజీ స్పెషలిస్ట్‌, సంస్థ వ్యవస్థాపకుడు హరీష్‌ బిజూర్‌ తెలిపారు. టాటా బ్రాండ్‌ విలువను బట్టి ఐపీఎల్‌ టోర్నమెంట్‌కు మరింత క్రేజ్‌ దక్కనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని